Pawan Kalyan
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అఖండ విజయం సాధించింది. కూటమిలో 21 అసెంబ్లీ స్థానాలకు 2 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన జనసేన ప్రభంజనం సృష్టించింది. కూటమి ఏర్పాటు, విజయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీరోల్ పోషించారు. గత ప్రభుత్వ తప్పిదాలను, జగన్ నిరంకుశ వైఖరిని ఇంటింటికీ ప్రచారం చేశారు. పార్టీ ప్రారంభించిన 15 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. తన పార్టీ నుంచి పోటీ చేసిన 20 మందిని గెలిపించారు.
విక్టరీ వెనుక అంజన్న..
పవన్ విక్టరీ వెనుక కొండగట్టు అంజన్న ఆశీర్వాదం ఉందన్న చర్చ ఇప్పుడు ఏపీ, తెలంగాణలో జరుగుతోంది. అంజన్న అంటే పవన్కు అమితమైన భక్తి. మెగా ఫ్యామిలీ మొత్తం హనుమాన్ భక్తులే. 2009 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి పవన్ కొండగట్టు అంజన్నను ఇలవేల్పుగా ఆరాధిస్తున్నారు. ఏ కొత్తపని ప్రారంభించిన కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకున్న తర్వాతే మొదలు పెడుతున్నారు.
వారాహికి పూజలు..
గత ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ ప్రచార రథం తయారు చేయించుకున్నారు. ఈ వాహనానికి వారాహిగా నామకరణం చేశారు. ఈ వాహనానికి కూడా కొండగట్టులోనే పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొత్తుల గురించి కూడా జనవరి 24న పవన్ కళ్యాణ్ కొండగట్టును ప్రస్తావించారు. అంజనేయస్వామి ఆశీస్సులతో బీజేపీ కూడా తమతో కలిసిందని తెలిపారు.
తొలి గెలుపు..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల పోటీచేసిన పవన్ కళ్యాణ్ ఒక్కచోట కూడా గెలవలేదు. ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగిన ఆయన భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు. తొలిసారి చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు. అదేసమయంలో కూటమి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ విజయానికి కొండగట్టు అంజన్న ఆశీర్వాదమే కారణమని పవన్తోపాటు, ఆయన కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan prabhanjanam with the blessings of kondagattu anjanna
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com