spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan political strategy: దువ్వాడ కోసం ధర్మాన బ్రదర్స్ ను వదులుకుంటున్న జగన్!

Jagan political strategy: దువ్వాడ కోసం ధర్మాన బ్రదర్స్ ను వదులుకుంటున్న జగన్!

Jagan political strategy: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ పరిస్థితి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇక్కడ పార్టీకి పెద్దదిక్కుగా ధర్మాన ఫ్యామిలీ ఉంది. కానీ అదే ధర్మాన ఫ్యామిలీ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్స్ అయినా దువ్వాడ శ్రీనివాస్ ఎగిరి పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గట్టిగానే టార్గెట్ చేసుకుంటున్నారు. కానీ వైసీపీ నాయకత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు అని ధర్మాన సోదరులపై కోపం పెంచుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. అప్పటినుంచి ఆ ధర్మాన సోదరులు ఇద్దరినీ టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ వెనుక వైసీపీలో పెద్ద తలకాయ ఉందన్నది అనుమానం. అందుకే తాడోపేడో తెలుసుకోవాలి అని ధర్మాన సోదరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ ధీమా వెనుక ఎవరు?
కొద్ది నెలల కిందట ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పై( duvvada Srinivas ) సస్పెన్షన్ వేటు వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తిరిగి తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ధీమాతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెబుతున్నారు. తన కోపమంతా ధర్మాన సోదరులపై మాత్రమేనని.. వారు కింజరాపు ఫ్యామిలీతో కలిపి తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని చెబుతున్నారు దువ్వాడ. అదే సమయంలో అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల గౌరవభావంతో ఉన్నారు. దీనిపై ధర్మాన సోదరుల్లో అనుమానం పెరుగుతోంది. అందుకే దువ్వాడను పార్టీ నుంచి బహిష్కరిస్తారా? లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోమంటారా? అని అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ పెద్దల హస్తం..
గత కొద్ది రోజులుగా ధర్మాన సోదరులను టార్గెట్ చేసుకుంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. అసలు వైసీపీ నుంచి ఆయన సస్పెన్షన్కు గురయ్యారు. కానీ పార్టీలో పరిణామాలపై మాట్లాడుతున్నారు. పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు ధర్మాన బ్రదర్స్. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కృష్ణ దాస్. ప్రతి నియోజకవర్గంలో సమీక్ష చేసి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కృష్ణ దాస్ ను టార్గెట్ చేసుకున్నారు దువ్వాడ. అది కూడా కాళింగ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని. లేనిపోని ఆరోపణలు చేస్తుంటే ధర్మాన బ్రదర్స్ మనస్థాపానికి గురవుతున్నారు. పైగా దువ్వాడ శ్రీనివాస్ హై కమాండ్ పేరు తరచూ చెబుతున్నారు. దీంతో వైసిపి పెద్దల నుంచి దువ్వాడకు అభయం ఉందన్న అనుమానం వీరిలో పెరుగుతోంది. అందుకే దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తారా? లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోమంటారా? అని నేరుగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేందుకు ధర్మాన బ్రదర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పెద్ద చిచ్చు పెడుతున్నారు. ఒకవేళ దువ్వాడ కోసం ధర్మాన బ్రదర్స్ ను వదులుకుంటే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో పార్టీ భూస్థాపితం కావడం ఖాయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper