Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivas: దువ్వాడకు వైసిపి డోర్స్ క్లోజ్!

Duvvada Srinivas: దువ్వాడకు వైసిపి డోర్స్ క్లోజ్!

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ సౌండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. దీంతో కొత్తూరు స్టేషన్లో ఆయన హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఏం మాట్లాడలేదు.. జనసైనికుల పై కూడా ఏ వ్యాఖ్యలు చేయలేదు. మంత్రి కింజరాపు అచ్చెనాయుడు ను టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం […]

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ సౌండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. దీంతో కొత్తూరు స్టేషన్లో ఆయన హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఏం మాట్లాడలేదు.. జనసైనికుల పై కూడా ఏ వ్యాఖ్యలు చేయలేదు. మంత్రి కింజరాపు అచ్చెనాయుడు ను టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసమే నన్న అనుమానాలు ఉన్నాయి. మొన్నటి వరకు ధర్మాన బ్రదర్స్ పై కామెంట్స్ చేసిన ఆయన ఇప్పుడు కింజరాపు బాబాయ్, అబ్బాయిలను టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇదంతా జగన్ దృష్టిలో పడేందుకే నన్న టాక్ ఉంది.

Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

* కేవలం సస్పెన్షన్ మాత్రమే..
వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ విధించింది. పూర్తిగా బహిష్కరించలేదు. ఆయన వైఖరి మారి.. పార్టీ జిల్లా నేతలతో కలిసి పనిచేస్తే సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది. కానీ ఆయన శృతిమించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన దూకుడు తనం నచ్చవచ్చు కానీ.. ఆయన వల్ల మిగతా జిల్లా నాయకులు దూరం కావడంతో పాటు పార్టీలో క్రమశిక్షణ లోపం వస్తుందని జగన్మోహన్ రెడ్డికి నివేదికలు వెళ్లాయి. అయితే కొద్ది రోజులు వేచి చూస్తే ధోరణి అనుసరిద్దామని జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ సామాజిక వర్గం పేరు చెప్పి పార్టీని ఇరకాటంలో పెట్టడాన్ని సహించలేకపోతున్నారు అధినేత. అందుకే ఆయనకు వైసీపీలో డోర్స్ క్లోజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

* పట్టించుకోని సజ్జల..
దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి సహకారం ఉందన్నది ప్రధాన ఆరోపణ. దాదాపు అన్ని జిల్లాల ముఖ్య నేతల కు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని సిద్ధం చేయడంలో సిద్ధహస్తులు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రతి జిల్లాలో ప్రధాన నేతలకు ఒక వ్యతిరేక వర్గాన్ని సిద్ధం చేస్తుంటారు సజ్జల. అలా ధర్మాన సోదరులకు వ్యతిరేకంగా ఉండే దువ్వాడకు సజ్జల భరోసా ఉండేది. కానీ రోజురోజుకు దువ్వాడ వ్యవహార శైలి శృతిమిస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి సైతం సజ్జలకు కీలక ఆదేశాలు ఇచ్చారట. దువ్వాడ శ్రీనివాస్ కు డోర్స్ క్లోజ్ చేయమని సూచించారట. కనీసం దువ్వాడ ఫోన్ కు సజ్జల రామకృష్ణారెడ్డి రెస్పాండ్ కావడం లేదు. దీంతో రాజకీయ అవకాశాలు దువ్వాడ శ్రీనివాస్ కు క్లోజ్ అయినట్టే. మరి దువ్వాడ రాజకీయాలను ఎలా చేస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper