Homeక్రీడలుక్రికెట్‌Team India Vs Ireland: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో...

Team India Vs Ireland: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

Team India Vs Ireland: టి20లో టీమ్ ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది. 2024 లో టి20 వరల్డ్ కప్ గెలిచిన నాటి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఏ ఒక్క సీరీస్ కూడా టీమిండియా కోల్పోలేదు. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే ఇంగ్లాండ్ వరకు ఏ జట్టు కూడా టీమ్ ఇండియాను ఓడించలేకపోయింది. సిరీస్ అందుకోలేకపోయింది. అయితే పెద్ద పెద్ద జట్లను ఓడించిన టీమిండియా.. అసలు ఏమాత్రం లెక్కలో లేని ఐర్లాండ్ ముందు తలవంచింది.. తలవంచడమే […]

Team India Vs Ireland: టి20లో టీమ్ ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది. 2024 లో టి20 వరల్డ్ కప్ గెలిచిన నాటి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఏ ఒక్క సీరీస్ కూడా టీమిండియా కోల్పోలేదు. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే ఇంగ్లాండ్ వరకు ఏ జట్టు కూడా టీమ్ ఇండియాను ఓడించలేకపోయింది. సిరీస్ అందుకోలేకపోయింది. అయితే పెద్ద పెద్ద జట్లను ఓడించిన టీమిండియా.. అసలు ఏమాత్రం లెక్కలో లేని ఐర్లాండ్ ముందు తలవంచింది.. తలవంచడమే కాదు టి20 చరిత్రలోనే చెత్త రికార్డును నమోదు చేసింది.

ఐర్లాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. అంతేకాదు అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద నమోదు చేసుకుంది. టి20 చరిత్రలోనే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రెండుసార్లు తొలి మ్యాచ్లో ఓడిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది.. ఆ తర్వాత 2026 లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. 2022 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా ఇంగ్లాండ్ జట్టు సైతం తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. కానీ రెండుసార్లు ఓటమిపాలైంది మాత్రం టీమిండియా.

టీమిండియా ఇలా దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ ప్లేయర్లే. పసికూన అని ఐర్లాండ్ జట్టును టీమిండియా ప్లేయర్లు తేలికగా తీసుకున్నారు. ముఖ్యంగా టీమ్ ఇండియా ఓడిపోవడానికి ప్రసిద్, వాషింగ్టన్ సుందర్ అని అభిమానులు మండిపడుతున్నారు. 16, 17 ఓవర్లలో వీరిద్దరూ ఏకంగా 46 పరుగులు ఇచ్చారు. దీనివల్ల ఐర్లాండ్ స్కోర్ 118 నుంచి 164 కు చేరింది. దీనికి తోడు శివం దుబే.. అభిషేక్ శర్మ.. వాషింగ్టన్ సుందర్ ఐర్లాండ్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్ లు నేలపాలు చేశారు. మరోవైపు టాపార్డర్ కూడా దారుణంగా ఆడింది ఏడుగురు బ్యాటర్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్ కు మాత్రమే పరిమితమయ్యారు. ఇలా ఆటగాళ్లు మొత్తం అత్యంత చెత్త ప్రదర్శన చేయడంతో ఐర్లాండ్ ముందు తలవంచుకోవలసి వచ్చింది.

ఒకవేళ ప్రసిద్ స్థానంలో వైభవ్ సూర్య వంశీని ఆడించి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. సూర్యవంశీని ఆడించకుండా అతడిని డ్రింక్స్ బాయ్పా త్రకు పరిమితం చేశారని అభిమానులు విమర్శిస్తున్నారు. గౌతమ్ గంభీర్ నెత్తి మాసిన ప్రయోగాలు చేస్తున్నాడని.. దీనివల్ల టీమిండియా ఓడిపోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్ ముందు టీమిండియా లోపాలు ఇలా బయటపడితే.. ఇంగ్లీష్ జట్టు మీద సిరీస్ ఎలా గెలుస్తుందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రెండో మ్యాచ్లో మేనేజ్మెంట్ ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper