Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: చంద్రబాబు సంచలన ఆదేశాలు

CM Chandrababu: చంద్రబాబు సంచలన ఆదేశాలు

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టొద్దని ఆదేశించారు.

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చాలా రకాల మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ప్రభుత్వపరంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. ప్రజల స్వేచ్ఛను, జీవించే స్వతంత్రాన్ని, హక్కులను కాలరాయకూడదని స్ట్రాంగ్ డెసిషన్ కు వచ్చారు. సాయంత్రం 6 గంటల తరువాత ప్రజలు దయనందిన జీవితంలో రిలాక్స్ అవుతారని.. ఆ సమయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండాలని మంత్రులకు, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టొద్దని ఆదేశించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో సీఎం గా ఉన్న జగన్ ఆకాశమార్గంలో బయలుదేరితే.. కింద రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించే వారన్న విమర్శ ఉంది. సామాన్యులు సైతం ఇబ్బందులు పడే వారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు జాగ్రత్త పడ్డారు.అటువంటి విమర్శలు రాకుండా ఉండాలని భావిస్తున్నారు. రోజువారి పర్యటనతో పాటు జిల్లాల సందర్శనకు వెళ్ళినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగేలా ట్రాఫిక్ ఆంక్షలు విధించవద్దని అధికారులను ఆదేశించారు.

మరోవైపు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధులు ముగించే సమయానికి సమీక్షలు, సమావేశాలు పెట్టవద్దని కూడా యంత్రాంగాన్ని ఆదేశించారు. సాధారణంగా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత వారంతా రిలాక్స్ మూడ్ లోకి వెళ్తారు. ఆ సమయంలో వారిని ఇబ్బంది పెట్టి సమీక్షలు, సమావేశాలు పెడితే వ్యతిరేకత వస్తుంది. గతంలో అటువంటివి చేసే చంద్రబాబు సర్కార్ మూల్యం చెల్లించుకుంది. అందుకే అటువంటి పరిస్థితి రాకుండా చంద్రబాబు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మంత్రులు సైతం సాయంత్రం 6 గంటలలోపే యంత్రాంగంతో పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. అటు పార్టీ శ్రేణులకు సైతం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బహిరంగ సభలు, సమావేశాల పేరిట ప్రజలను ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. మంత్రుల సైతం వీలైనంత తక్కువగా కాన్వాయ్ తో వెళ్లాలని.. భారీ కాన్వాయ్ తో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేలా చూడొద్దని కూడా చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. సింపుల్ గవర్నమెంట్ అన్న మాదిరిగా ముందుకు సాగాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper