Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu And Revanth Reddy: చంద్రబాబు, రేవంత్ భేటీ.. కెసిఆర్, జగన్ కు ఇచ్చే సంకేతం...

Chandrababu And Revanth Reddy: చంద్రబాబు, రేవంత్ భేటీ.. కెసిఆర్, జగన్ కు ఇచ్చే సంకేతం ఏంటి?

Chandrababu And Revanth Reddy: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు హైదరాబాద్ వేదికగా భేటీ కానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ కు వెళ్ళనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ తో సమావేశం కానున్నారు. విభజన సమస్యలతో పాటు ఇతరత్రా అంశాలను చర్చించే అవకాశం స్పష్టంగా ఉంది. ముఖ్యంగా తమ రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్, జగన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వాలని ఆ ఇద్దరు సీఎంలు భావిస్తున్నట్లు సమాచారం. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ సీఎం గా జగన్, తెలంగాణ సీఎం గా కెసిఆర్ ఎన్నికయ్యారు. ఏపీ విభజన తర్వాత కొంతకాలం హైదరాబాదులోనే చంద్రబాబు ఉన్నారు. కానీ ఫోన్ టాపింగ్ వివాదంతో చంద్రబాబు ఉన్నపలంగా అమరావతి వెళ్లాల్సి వచ్చింది. అప్పటినుంచి కెసిఆర్ తో చంద్రబాబుకు రాజకీయ విభేదాలు కొనసాగుతూ వచ్చాయి.

2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు చంద్రబాబు. కానీ ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. దీంతో 2023 ఎన్నికల్లో ఆ సాహసం చేయలేకపోయారు చంద్రబాబు. ఎన్నికల నుంచి తప్పుకొని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తీశారు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం కావడానికి కేసీఆర్ కారణమని చంద్రబాబుకు కోపం ఉంది. 2019 ఎన్నికల్లో ఏపీలో తనను దారుణంగా దెబ్బతీసేందుకు జగన్ కు కేసిఆర్ ఆర్థిక సాయం చేశారు అన్న అనుమానం కూడా ఉంది.మొన్నటికి మొన్న అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాదులో నిరసనలకు అనుమతి కూడా ఇవ్వలేదు కేసీఆర్ సర్కార్. అందుకే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లోపోటీ నుంచి తప్పుకుంది తెలుగుదేశం.కాంగ్రెస్ విజయానికి మార్గం సుగమం చేసింది.

కెసిఆర్ సర్కార్లో ప్రధాన బాధితులు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. రేవంత్ ద్వారా చంద్రబాబు చుట్టూ ఉచ్చుబిగించారు కేసీఆర్. చంద్రబాబుకు ఏపీకి పంపించారు. రేవంత్ ను జైల్లో పెట్టి హింసించారు. అదే రేవంత్ కు ఇమేజ్ తెచ్చి పెట్టింది. తెలంగాణలో అధికారంలోకి తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడు కెసిఆర్ ను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు రేవంత్. అటు ఏపీలో జగన్ నిర్వీర్యం చేస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబుకు రేవంత్ అత్యంత సన్నిహితుడు. ఈ లెక్కన చంద్రబాబు ప్రత్యర్థి జగన్ కూడా రేవంత్ కు వ్యతిరేకి. అందుకే ఈ ఇద్దరు సీఎంలు ఉమ్మడి ప్రత్యర్థులపై సంధించే బాణాలు ఏ విధంగా ఉంటాయన్నది హార్ట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించిన ఈ గురు శిష్యులు.. ఆ రాజకీయ మిత్రులకు గట్టిగానే సంకేతాలు పంపనున్నారు. ఊపిరాడకుండా చేస్తామని హెచ్చరికలు జారీ చేయనున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular