Homeఆంధ్రప్రదేశ్‌Sri Reddy : ఆత్మహత్య ఆలోచనలు.. అందరిలో కలవరాన్ని రేపుతున్న శ్రీ రెడ్డి పోస్ట్.. ఇంతకు...

Sri Reddy : ఆత్మహత్య ఆలోచనలు.. అందరిలో కలవరాన్ని రేపుతున్న శ్రీ రెడ్డి పోస్ట్.. ఇంతకు అందులో ఏముంది..?

Sri Reddy : ఇక రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచి అధికారంలోకి వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు సీఎం గా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి గత వైసిపి ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో తెలుసుకొని వాటిని సరిదిద్దే పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఎలక్షన్స్ కు ముందు చాలా రకాల మాటలను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలామంది ప్రస్తుతం అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్లు కనక బయటికి వస్తే కార్యకర్తలే వాళ్ల మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయి అసలు మీడియా ముందుకే రావడం లేదు. ఇక ఎలక్షన్స్ కి ముందు అధికారం ఉందని ఏది పడితే అది వాగిన వాళ్లందరిలో శ్రీరెడ్డి ఒకరు. నిజానికి శ్రీరెడ్డికి పవన్ కళ్యాణ్ కి అసలు ఎలాంటి సంబంధం లేకపోయిన కూడా ఆమె వైసీపీ పార్టీ అధినేత అయిన జగన్ కి ఫేవర్ గా మారి పవన్ కళ్యాణ్ పైన దారుణమైన విమర్శలు చేసింది. అలాగే ఆయన్ని ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ మీద కూడా కామెంట్స్ చేసింది. ఇక ఇదంతా చూస్తూ కూర్చున్న ఆయన అభిమానులు గాని, పార్టీ కార్యకర్తలు గాని ఏమీ చేయలేక కామ్ గా ఉన్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఇతరుల మీద దాడి చేయడం అంటే నచ్చదు. రాజకీయం లో ఎవరి కి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఆయన తన వైఖరితో ముందుకు వెళుతూ ఉంటాడు. ఇక ఆయన నమ్మిన సిద్దాంతం లోనే ముందుకు కదిలి తను ఏదైతే సాధించాలి అనుకున్నాడో దాన్ని సాధించాడు…ఇక ఇప్పుడు అధికారం లో ఉన్న ఎన్డీయే కూటమి వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనే భయం తో శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద నుంచి ఒక పోస్ట్ అయితే చేసింది.

అందులో ఏముంది అంటే ‘ఆమె చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయిందంట. ఇక తనని ఆ భద్రకాళి అమ్మవారు సేవ్ చేయాలని, ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్స్ లో ఆమెకు సూసైడ్ చేసుకునే విధంగా ఆలోచనలు వస్తున్నాయట…ఒకవేళ తను సూసైడ్ చేసుకున్న కూడా దానికి మీడియా, టిడిపి, జనసేన పార్టీలే కారణం అవుతాయని, ఇకమీదట తను ఎన్ని రోజులు బతుకుతానో కూడా తెలియదంటూనే ఆమె చేసిన ఈ కామెంట్స్ ను కొంతమంది సిల్లి కామెంట్స్ అనుకుంటారు. కానీ నేను చేస్తున్న కామెంట్స్ నిజం నాకు చనిపోవాలని ఉంది’. అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది…

అయితే ఇది చూసిన చాలామంది ఎలక్షన్స్ కి ముందు ఎవరో చెప్పారని ఇతరులను తిట్టారు. ఇక ముందు బూతులు మాట్లాడటం ఎందుకు ఇప్పుడు ఇలాంటి పోస్ట్ లు పెట్టడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు… ఇక శ్రీ రెడ్డి కామెంట్స్ పైన మరి కొంతమంది స్పందిస్తూ ఆమె ఎవరినో బెదిరించడానికి అలాంటి పోస్ట్ చేస్తుందే తప్ప అది జన్యూన్ గా అనిపించడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు….

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular