Zombie Reddy 2: ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హిట్లు ఇచ్చే హీరోల లిస్ట్ తీస్తే అందులో తేజ సజ్జ కచ్చితంగా ఉంటాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించి , చిన్నప్పుడే స్టార్ గా ఎదిగిన తేజ సజ్జ, పెద్దయ్యాక ‘బేబీ’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ సినిమా తర్వాత ఈయన చేసిన ‘అద్భుతం’, ‘ఇష్క్’ వంటి చిత్రాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన కెరీర్ కి పెద్ద బూస్ట్ ఇచ్చిన చిత్రం ఏదైనా ఉందా అంటే , అది ‘జాంబీ రెడ్డి’ చిత్రమే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత అదే ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో ఆయన హీరో గా నటించిన ‘హనుమాన్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలను నెలకొల్పిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ చిత్రం తర్వాత ఆయన హీరో గా నటించిన ‘మిరాయ్’ కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘జాంబీ రెడ్డి 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్సకత్వం వహించడం లేదు కానీ, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సూపర్న్ ఎస్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేయగా , దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా శనాయ కపూర్ నటిస్తుండగా , కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇన్ని రోజులు ఈ చిత్రం లో ఉపేంద్ర నటిస్తున్నడానే విషయం ఎవరికీ తెలియదు. నేడు ఈ గ్లింప్స్ లో ఆయన పేరు కూడా వేయడం తో అందరూ సర్ప్రైజ్ అయ్యారు.
ఇక ఈ గ్లింప్స్ ని చూస్తుంటే ఈసారి భారీ బడ్జెట్ తో , చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని తీయబోతున్నారని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తోంది. అయితే గ్లింప్స్ మొత్తం యానిమేషన్ రూపం లో ఉండడం తో , ఆడియన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఇంత షూటింగ్ జరిగింది కదా , ఇంకా ఎందుకు ఇలా యానిమేటెడ్ వీడియోస్ చేయడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే గ్లింప్స్ చివర్లో , ఈసారి వేరే లెవెల్ అంటూ తేజ సజ్జ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ గ్లింప్స్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.