Homeఅంతర్జాతీయంUgadi Celebrations : టొరంటోలో వైభవంగా ఉగాది ఉత్సవాలు

Ugadi Celebrations : టొరంటోలో వైభవంగా ఉగాది ఉత్సవాలు

Telangana Canada Association (TCA) Ugadi Celebrations in Toronto : తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో ఈ శనివారం ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. గ్రేటర్ టోరంటో నగరంలోని ‘కెనడా తెలుగు, తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక వర్చువల్ ఉత్సవాలు’ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలలో దాదాపు 200 పైగా తెలుగు వారు పాల్గొన్నారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మన్నెం శ్రీనివాస్ వారి సతీమణి స్వాతి దీప ప్రజ్వలన చేసి ఉగాది పండుగ 2022 ఉత్సవాలను ప్రారంభించారు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈద రాజేశ్వర్ మాట్లాడుతూ కెనడా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ అత్యంత ఉత్సహంగా, భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నామన్నారు. మన తెలుగు సంప్రదాయాలను, కట్టు, భొట్టు లను భావితరాలకు అందచేయడం హర్షణీయమన్నారు. ఈ సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఫౌండేషన్ కమిటీ  సభ్యుల సహకారంతో జరిగాయన్నారు.

ఉగాది పండుగ ఉత్సవాల సందర్బంగా టీసీఏ వారు ” పిట్స్ బర్గ్“ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజ చేశారు. ప్రముఖ జ్యోతిష్కులు ధనాలకోట సురేష్ చంద్ర వర్మ (హైదరాబాద్-ఉప్పల్) వారితో శ్రోతలకు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్బంగా ఉగాది పండుగ విశిష్టత తెలిపారు. చిన్నారులతో ఉగాది పచ్చడి చేయు విధానాన్ని చక్కగా శ్రోతలకు వివరించారు. “గజి బిజీ బడి” అనే విన్నూతమైన నాటకం ప్రదర్శించారు. సుమారు 20 పైగా చిన్నారులు, పెద్దవారితో ప్రదర్శించడం ఆకట్టుకుంది. ట్రేండింగ్ రీల్స్, ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులందరిని ఆకర్షించాయి.

ఈ వేడుకల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విభిన్నరూపంలో సుమారు 3 గంటల పాటు వర్చువల్ గా సభికులని అలరించాయి. ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలుగు వారు ప్రదర్శించటం విశేషం. ఈ సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ టెక్నికల్ టీం లో వెంకట జితేందర్ చక్క , కుమారి రిషిమా గజవాడ, ఈద శివానీ, ఈద వైష్ణవి, తాటి సాయి రామ్, టెక్నికల్ ఇబ్భంది లేకుండా ఆర్గనైజ్ చేయడం గమనార్హం. వర్చ్యువల్ ఈవెంట్ ను రాహుల్ బాలినేని, మానస ఇనగంటి చాల కామెడీగా సమన్వయంతో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, బోర్డ్ అఫ్ ట్రస్టీ అధ్యక్షులు సంతోష్ గజవాడ, కల్చరల్ సెక్రటరీ శ్రీమతి కవిత తిరుమలాపురం, ట్రెజ్రెరర్ నవీన్ ఆకుల, కార్యవర్గసభ్యు లు, బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యులు పాల్గొన్నారు. వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాస్ తిరునగరి, కోటేశ్వర రావు చిత్తలూరి శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల , విజయ్ కుమార్ తిరుమలాపురం, హరి రాహుల్, పభ్రాకర్ కంబాలపల్లి, ప్రకాష్ చిట్యాల పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ మన్నెం సందేశంతో ‘ఏ దేశమేగినా ఎందు కాలెడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం’అంటూ కృతజ్ఞత వందన సమర్పణతో విజయవంతంగా ముగిసింది..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular