spot_img
Homeఅంతర్జాతీయంAmerica : అమెరికా దిగువ సభలో హిందువులు.. అగ్రరాజ్యంలో సరికొత్త చరిత్ర!

America : అమెరికా దిగువ సభలో హిందువులు.. అగ్రరాజ్యంలో సరికొత్త చరిత్ర!

America :  అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. త్వరలో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే తీసుకునే నిర్ణయాలపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటే జరిగిన పార్లమెంటు దిగువ సభ ఎన్నికల్లో గెలిచిన నలుగురు హిందువులు శుక్రవారం(జనవరి 3న) సభలో అడుగు పెట్టారు. అమెరికాలో మైనారిటీ వర్గమైన హిందువులో ఒకేసారి నలుగురు దిగువ సభకు ఎన్నిక కావడం ఆదేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆరుగురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఈసారి దిగువ సభ ఎన్నికల్లో గెలవగా వారిలో నలుగురు హిందువులు కావడం విశేషం. డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థుల్లో క్రైస్తవేత, యూదు యేతర మత విశ్వాసం ఉన్న వ్యక్తులు కేవలం 14 మంది మాత్రమే. వీరిలో హిందువులు నలుగురు, ముస్లింలు నలుగురు, బౌద్ధులు ముగ్గురు, ఏ మతం ఆచరించనివారు ముగ్గురు ఉన్నారు. హిందువుల్లో సుహాస్‌ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, రోఖన్నా, శ్రీథానేదార్‌ తాజా ఎన్నికల్లో విజయం సాధించారు.

వీరు కూడా..
ఇక ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్‌ ప్రమీలా జయపాల్‌ తన మతం ఏమిటనేది పేర్కొనలేదు. భారతీయ మూలాలున్న మరో సీనియర్‌ దిగువ సభ సీనియర్‌ సభ్యుడు డాక్టర అమీ బెరా దేవుడు ఒక్కడే అనే విశ్వాసాన్ని నమ్ముతానని తెలిపారు. 12 ఏళ్ల క్రితం తాను దిగుబ సభలో ప్రమాణం చేసేటప్పుడు తాను ఒక్కడినే భారతీయ అమెనక్‌ను అని, ఇప్పుడు మా బలం ఆరుకు పెరిగింది అని వెల్లడించారు. మొత్తం సభ్యుల్లో క్రైస్తవులదే మెజారిటీకాగా, 31 మంది(6 శాతం) యూదులు ఉన్నారు. గెలిచిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల్లో 98 శాతం మంది, డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుల్లో 75 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు.

స్పీకర్‌గా మళ్లీ మైక్‌
ఇక అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌గా 52 ఏళ్ల మైక్‌ జాన్సన్‌ మరోమారు ఎన్నికయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో కేవలం మూడు స్వల్ప ఓట్ల మెజారిటీతో నెగ్గారు. వందేళ్ల చరిత్రలో ఇంత తక్కువ మెజారిటీతో గెలిచిన స్పీకర్‌గా మైక్‌ చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మైక్‌ బరిలో దిగారు. దిగువ సభలో 219 మంది రిపబ్లికన్లు ఉండగా, 215 మంది డెమొక్రాట్లు ఉన్నారు. మైక్‌కు అనుకూలంగా 2018 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 215 మంది ఓటేశారు. డెమొక్రటిక్‌ సభ్యుడు హకీమ్‌ జెఫ్రీస్‌ సైతం మైక్‌కే ఓటు వేయడం విశేషం. స్వల్ప మెజారిటీతో నెగ్గిన మైక్‌ వెంటనే స్పీకర్‌గా ప్రమాణం చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper