Viral Video : సాధారణంగా మహిళలు కుళాయిల వద్ద కొట్టుకుంటారు. ఇళ్ల వద్ద శుభ్రం చేసే క్రమంలో చెత్త గురించి గొడవ పెట్టుకుంటారు. కానీ విచిత్రంగా ఇద్దరు మహిళలు ఓ విషయంలో కొట్లాడుకున్నారు. ఏకంగా గంటలపాటు జుత్తులు పీక్కుంటూ అక్కడున్న వారికి వినోదం పంచారు. అక్కడితో ఆగకుండా చుట్టూ ఉన్నవారు ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
గుంటూరు నగరంలో ఇటీవల గాంధీ పార్క్ ను ప్రారంభించారు. నగరంలో ఉన్న ఏకైక అతిపెద్ద పార్కు అదే కావడంతో జనాలు ఎగబడుతున్నారు. వీకెండ్ వస్తే పార్కు రద్దీగా మారిపోతుంది. పార్కును ఆధునికరించడంతోపాటు చిన్నపిల్లల కోసం ప్రత్యేక గేమ్ జోన్, టాయ్ ట్రైన్, సెల్ఫీ పాయింట్ వంటి వాటిని ఏర్పాటు చేశారు. దీంతో నగరం నలుమూలల నుంచి సందర్శకులు వస్తున్నారు. ముఖ్యంగా సెల్ఫీ పాయింట్ వద్ద విపరీతమైన పోటీ నెలకొంది.
ఈ క్రమంలో ఇటీవల పార్కు రద్దీగా ఉన్న వేళ సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు తీసేందుకు ఇద్దరు మహిళలు పోటీపడ్డారు. నేను ముందంటే నేను ముందు అని సవాల్ చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని దాడులకు తెగబడ్డారు. దాదాపు గంట పాటు వారి మధ్య వీరోచిత పోరాటం జరిగింది. కానీ ఆ ఇద్దరిని విడిపించేందుకు అక్కడున్న వారు సాహసించలేదు. కనీసం సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి గొడవను నియంత్రించలేదు. సుమారు గంటపాటు కొట్టుకున్న మహిళలు అలసి సొలసి విరమించుకున్నారు. అయితే అక్కడున్న వారు మహిళల భీకర పోరును తమ సెల్ ఫోన్లలో బంధించారు. సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Gandhi Park, Guntur.
Ladies Fighting…we are so developed.
pic.twitter.com/fgqfWOef4k— Saran Bhuma (@telugodikeka) November 27, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More