Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశుల వారికి ఈరోజు రాజయోగం.. 12 రాశి ఫలాలు ఏ విధంగా...

Rashi Phalalu: ఈ రాశుల వారికి ఈరోజు రాజయోగం.. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 28న మంగళవారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం, సింహంతో పాటు పలు రాశుల వారిపై ప్రభావం ఉండనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
కార్యాలయాల్లో ఉద్యోగులకు సీనియర్ల నుంచి సహకారం ఉంటుంది. వివాహం చేసుకోవాలనుకునేవారికి మంచి సమయం. ప్రతిపాదనలు వస్తుంటాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు.

వృషభం:
కొన్ని సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. దీంతో వీరు మనశ్శాంతి కోల్పోతారు. వ్యాపారస్తులకు నష్టాలు సంభవిస్తాయి. కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది.

మిథునం:
అకారణంగా ఆస్తులను విక్రయించొద్దు. ముఖ్యమైన సమాచారం బాధ కలిగిస్తుంది. యువకులు సరదాగా గడుపుతారు. ఆస్తులు అమ్మాలనుకునేవారి కల నేరవేరుతుంది.

కర్కాటకం:
ఈ రాశివారికి నిరుత్సహమే ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగం చేసేవారికి సీనియర్ల నుంచి ప్రతి కూల వాతవరణం ఉంటుంది.

సింహం:
పెండింగులో ఉన్న ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే కుటుంబ సభ్యుల బాధ్యతలు ఉంచుకోవాలి.

కన్య:
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో తండ్రి మార్గదర్శకంలో నడుస్తారు. చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి.

తుల:
శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారులు ప్రణాళికవంతంగా ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఆటంకాలు కలుగుతాయి.

వృశ్చికం:
పెండింగు పనులుపూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఊహించని లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

ధనస్సు:
మీపై ప్రత్యర్థులు విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. పదోన్నతులు ఉండే అవకాశం.

మకరం:
బంధువుల సహాయంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఎక్కువ. వ్యాపారులకు ఊహించని లాభాలు.

కుంభం:
విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా కష్టపడాలి.

మీనం:
ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది. ఐటీ రంగంలో పనిచేసేవారికి అనుకూలం. వ్యాపారులు ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. ఫలితంగా లాభాలు వస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular