Homeట్రెండింగ్ న్యూస్Rajasthan: వధువు జంప్‌.. వరుడి నిరీక్షణ.. 13 రోజులు పెళ్లి దుస్తులతో ఎదురుచూపు.. చివరకు ట్విస్ట్!

Rajasthan: వధువు జంప్‌.. వరుడి నిరీక్షణ.. 13 రోజులు పెళ్లి దుస్తులతో ఎదురుచూపు.. చివరకు ట్విస్ట్!

Rajasthan: మన దేశంలో పెళ్లిళ్లు ఎంతో వేడుకగా జరుగుతాయి. అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ట్రెండ్‌ మారుతున్న కొద్దీ, టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ.. వేడుకల తీరు కూడా మారుతోంది. అయితే పెళ్లిళ్లలో ఒక్కోసారి అనుకోని ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అటువంటి ఊహకందని ఉదంతం రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

తెల్లారితే పెళ్లి.. ఇంతలోనే..
రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్‌ కుమార్తె మనీషాకు వారి బంధువైన శ్రవణ్‌ కుమార్‌తో వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లి వేడుకలో భాగంగా వరుని తరుపు వారంతా మే 3న పెళ్లికుమార్తె ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. వారికి పెళ్లి కుమార్తె తరుపువారు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. మే 4న ఉదయం వివాహ తంతులో భాగంగా మండపంలోకి పెళ్లి కుమార్తెను తీసుకురావాలని పురోహితుడు కోరాడు. కొద్దిసేపు వెయిట్‌ చేయాలని పెళ్లి కుమార్తె తరపువారు చెప్పారు. పెళ్లికుమార్తె మనీషా తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తున్నదని చెప్పి ఇంటి వెనుకవెపు వెళ్లింది. తరువాత అక్కడే ఉన్న ఒక బంధువుతోపాటు అక్కడి నుంచి జంప్‌ అయింది.
తిరిగి రాకపోతుందా అని..
ఎంతసేపయినా పెళ్లి కుమార్తె తిరిగి రాకపోవడంతో బంధువులంతా హడలిపోయారు. ఈ సందర్భంగా పెళ్లికుమార్తె తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లి ముస్తాబు చేసుకునేందుకు గదిలోనికి వెళ్లిందని, తరువాత కడుపు నొప్పి వస్తున్నదని చెప్పి టాయిలెట్‌కు వెళ్లిందన్నారు. తరువాత తన మామ కుమారుడు భరత్‌కుమర్‌తో వెళ్లిపోయిందని చెప్పాడు.

బంధువు నచ్చజెప్పినా..
మామ ఇంట్లో ఉన్న వధువుకు బంధువులు ఎంత నచ్చచెప్పినా ఆమె ఈ వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె 13 రోజుల పాటు ఇంటిలోనే మొండికేసి కూర్చుంది. అయితే ఆమెపై అమితమైన ప్రేమ కలిగిన వరుడు.. పెళ్లి అలంకరణలో భాగంగా తాను ధరించిన పగడీ కూడా తీయకుండా ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అంతవరకూ పెళ్లి మండపాన్ని అలంకరణతోనే ఉంచారు.

నిరీక్షణ ఫలించింది…
అయితే ఎట్టకేలకు బంధువులంతా ఒప్పించి పెళ్లి కుమార్తెను మే 15న కల్యాణ మండపానికి తీసుకురాగలిగారు. దీంతో మే 16 వారి వివాహం ఘనంగా జరిగింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular