Sridevi Drama Company: బుల్లితెర మీద సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ లది దశాబ్దాపు కాల ప్రయాణం. ఒకరినొకరు సప్పోర్ట్ చేసుకుంటూ కెరీర్లో ఎదిగారు. వీరు చేసిన చిన్న ప్రయత్నం ట్రెమండస్ సక్సెస్ అయ్యింది. ప్రయోగాత్మకంగా రష్మీ-సుధీర్ మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. దాన్ని అలానే కంటిన్యూ చేశారు. రష్మీ, సుధీర్ అంటే ప్రేమికులు అనుకున్నంతగా బలపడిపోయింది. జబర్దస్త్ లో మొదలైన వీరి రొమాన్స్, కెమిస్ట్రీ… ఢీ డాన్స్ రియాలిటీ షోలో పీక్స్ కి చేరింది. ఇద్దరి మీద రొమాంటిక్ స్కిట్స్, సాంగ్స్ రూపొందించారు.
ఏకంగా ఒకటి రెండు సార్లు వీరికి పెళ్లి చేశారు. ఆ ఎపిసోడ్స్ టీఆర్పీ కుమ్మేశాయి. మొత్తంగా జబర్దస్త్, ఢీ షోలకు సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ ప్లస్ అయ్యింది. అదే సమయంలో వారికి కూడా పిచ్చ ఫేమ్ వచ్చింది. నేను ఈ స్థాయికి రావడానికి రష్మీ కూడా ఒక కారణమని సుధీర్ ఓపెన్ గానే చెప్పారు. కాగా ఈ బుల్లితెర లవ్ బర్డ్స్ ని ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. సుధీర్ మల్లెమాల షోస్ కి పూర్తిగా దూరమయ్యాడు.
దాంతో రష్మీ-సుధీర్ మధ్య దూరం పెరిగింది. అప్పుడప్పుడు సుధీర్ ప్రస్తావన వస్తూ ఉంటుంది. రష్మీ కొంత ఎమోషనల్ అవుతుంది. అయితే ఎట్టకేలకు వీరు మళ్ళీ కలిశారు. త్వరలో ప్రసారం కానున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సుధీర్ వస్తున్నాడు. ఇక వీరి కొంచెం చూపులు, చిలిపి మాటలతో ఎపిసోడ్ హైలెట్ కానుంది.
థాంక్యూ స్పెషల్ పేరుతో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ నిర్వహిస్తున్నారు. బుల్లితెర స్టార్స్ గా ఎదగడంలో దోహదం చేసిన వారిని వేదిక మీదకు పిలిచి కొందరు ధన్యవాదాలు తెలుపుకోనున్నారు. దర్శకుడు తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, సంతోష్ శోభన్ తో పాటు సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ఇంకా పలువురు ఈ ఎపిసోడ్లో పాల్గొననున్నారు. ఈ వేదిక సాక్షిగా సుధీర్-రష్మీ తమ ప్రేమ బయటపెట్టే ఆస్కారం కలదు. ఎందుకంటే వారు కెరీర్ లో ఎదగడంలో ఒకరికొకరు సహాయపడ్డారు. ఈ థాంక్యూ స్పెషల్ ఈవెంట్లో ఊహించనిది జరగబోతుందని అందరూ అంచనా వేస్తున్నారు.