Bihar: ఒకప్పుడు పోలీస్ జాబ్ అనగానే బయపడేవారు. భద్రత కారణాల వల్ల ఈ జాబ్ చేయడానికి ఎక్కువగా ముందుకు వచ్చే వారు కాదు. కానీ రాను రాను పోలీస్ జాబ్ పై అవగాహన పెరగడంతో అబ్బాయిలే కాదు అమ్మాయిలు సైతం ఈ రంగంలో అడుగుపెట్టి తమదైన ప్రతిభ చూపుతున్నారు. తాజాగా ఓ కుటుంబంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు అమ్మాయిలో పోలీస్ జాబ్ కు సెలక్ట్ అయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరో విశేషం. అయితే వీరు ఊరికే ఈ స్థితికి రాలేదు. వీరు జాబ్స్ రావడం వెనక కన్నీళ్లే ఉన్నాయి. ఆ స్టోరీలోకి వెళ్తే..
బీహార్ రాష్ట్రంలోని ఛప్రా జిల్లాలో కమల్ సింగ్ అనే రైతు ఉండేవాడు. ఈయనకు ఒకరి తరువాత మరొకరు మొత్తంగా 8 మంది కుమార్తెలు జన్మించారు. వీరిలో ఒక అమ్మాయి అనారోగ్యంతో మరణించింది. అయితే మిగతా ఏడుగురిని చూసిన ఊళ్లో వారంతా హేళన చేశారు. ఇంత మంది కుామార్తెల జీవితాలు ఎప్పుడు బాగుపడుతాయి? అని చిన్నచూపు చేసేవారు. చుట్టుపక్కల వాళ్లు అనే మాటలకు కమల్ సింగ్ భరించలేక తన కుటుంబం తో సహా సరన్ జిల్లాలోని నాచాప్ గ్రామానికి వలస వచ్చాడు. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు.
అయితే తాను వ్యవసాయం మాత్రమే చేయకుండా తమ కుమార్తెలను ప్రయోజకులుగా చేయాలని అనుకున్నాడు. దీంతో ఇంటి వద్ద పిండి గిర్ని పెట్టి అధిక ఆదాయాన్ని ఆర్జించాడు. ఇలా వచ్చిన డబ్బుతో కూతుళ్లను చదివించాడు. వీరిలో పెద్ద కూతురు శస్త్ర సీమ బల్ ఓ వైపు తండ్రికి సాయంగా ఉంటూనే పోలీస్ జాబ్ కోసం ప్రయత్నించింది. ఈవెంట్స్ ప్రాక్టీస్ లో భాగంగా పొలాల్లో పరుగెత్తింది. ఆ తరువాత కానిస్టేబుల్ జాబ్ కు ఎంపికైంది.
ఈమె ఉద్యోగాన్ని సాధించడం చూసి మిగతా కుమార్తెల్లో పట్టుదల పెరిగింది. అయితే వారు కూడా పోలీసులు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో రెండో అమ్మాయి వివాహం అయిన తరువాత కూడా ప్రాక్టీస్ చేసింది. దీంతో 2009లో బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ జాబ్ కు ఎంపికైంది. ఆ తరువాత మిగతా 5గురు కుమార్తెల్లో కొందరు పోలీస్, మరికొందరు పారామిలటరీ ఉద్యోగాలు సాధించారు. అయితే వీరింతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవడం గమనార్హం. వీరంతా ఉద్యోగాలు పొందడంపై వారి తండ్రి ఆనందానిి అవధుల్లేకుండా పోయింది.