spot_img
Homeట్రెండింగ్ న్యూస్Revanth Reddy-KTR : ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్.. ఈ విషయంలో ఏకమయ్యారు

Revanth Reddy-KTR : ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్.. ఈ విషయంలో ఏకమయ్యారు

Revanth Reddy-KTR : తెలంగాణ రాష్ట్రంలో సరిగా 15 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. పది సంవత్సరాలపాటు పరిపాలించిన భారత రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రజలు కాదనుకున్నారు. అలాగని కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ ఇవ్వలేదు. ప్రతిపక్షానికి సముచిత ప్రాధాన్యం ఇస్తూనే.. అధికార పార్టీకి కాసింత ఎక్కువ గౌరవం ఇచ్చారు. మొత్తంగా చూస్తే బలమైన ప్రతిపక్షాన్ని.. సముచితమైన అధికార పక్షాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న భారత రాష్ట్ర సమితి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పటినుంచి ఇప్పటివరకు బలంగా ఢీకొంటూనే ఉన్నాయి. ఒకటి తప్పులను మరొకరు ఎండగట్టుకుంటూనే ఉన్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణలో ప్రతిరోజు ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. పోటాపోటీగా విమర్శలు చేసుకోవడం.. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేయడం ఈ రెండు పార్టీలకు పరిపాటిగా మారిపోయింది. కేటీఆర్, హరీష్ రావు, కవిత భారత రాష్ట్ర సమితి నుంచి.. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు.

Also Read : ఏకమైన దక్షిణాది రాష్ట్రాలు.. ఏకీభవించిన చంద్రబాబు.. వైసిపి తటస్థం

ఒకే వేదికపై..

ఉప్పు నిప్పులాగా ఉండే కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కనిపించారు. శనివారం తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, భారత రాష్ట్ర సమితి నుంచి కేటీఆర్, జగదీష్ రెడ్డి వంటి వారు హాజరయ్యారు. ఈ సభకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శాలువా కప్పి ఆహ్వానించారు. కేటీఆర్ కు కూడా శాలువా కప్పి గౌరవించారు. ఇక తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్టాలిన్ కు శాలువా కప్పి.. పాదాలకు నమస్కరించారు. దక్షిణాది రాష్ట్రాలలో జరుగుతున్న డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ సభకు కేరళ ముఖ్యమంత్రి విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ హాజరయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి నేతలు ఎవరూ హాజరు కాలేదు. కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కు మద్దతుగా ఉన్నాయి. ఇక ప్రతిపక్ష వైసిపి కూడా డిఎంకె నిర్వహిస్తున్న సభకు హాజరు కాకపోవడం విశేషం. అయితే ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్ ఉండడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. ఇక రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ఒకే వేదికపై విస్తృతంగా మాట్లాడుకున్నారు. కేటీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.. మరి ఈ వేదికపై స్టాలిన్, విజయన్, రేవంత్ రెడ్డి, కేటీఆర్, డీకే శివకుమార్ ఎలాంటి సందేశం ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

Also Read : డి లిమిటేషన్ తో ఏపీలో పెరిగే నియోజకవర్గాలు ఎన్నో తెలుసా?

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper