‘బాహుబలి’ సిరీసుల తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
Also Read: క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న రాశి !
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రారంభమైనప్పటికీ ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సంబంధించిన ఏదో ఒక న్యూస్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటోంది. ఈక్రమంలోనే నిన్న దర్శకుడు రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ చూసిన కొందరు అభిమానులు కొమురం భీమ్(ఎన్టీఆర్).. అల్లూరి సీతరామరాజు(చరణ్) కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాడుతారని కామెంట్స్ పెట్టారు. దీనిని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ స్పందించడం విశేషం. తాజాగా విడుదలైన పోస్టర్లో ఎన్టీఆర్, చరణ్లు కలుసుకుంటారు.. ఫొటోలో ఉండేది వారి చేతులే. కానీ ఇది ఫిక్షనల్ మూవీయే తప్ప దేశభక్తి చిత్రం కాదు’ అంటూ చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.
దీంతో ఈ మూవీ దేశభక్తి మూవీ కాదా? మరీ కథేంటీ అనే చర్చ జోరుగా ఫిల్మ్ నగర్లో జోరుగా నడుస్తోంది. ఇటీవల కరోనా నిబంధనలు పాటిస్తూ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఓ చిన్న వీడియో పోస్టు చేసింది. దీనిని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
Also Read: అమితాబ్ పై అప్యాయతను చాటుకున్న చిరంజీవి
ఇక అక్టోబర్ 22న దసరా సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన టీజర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో ఈ టీజర్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.