Homeట్రెండింగ్ న్యూస్సంచలనం: 139మంది రేప్ కేసులో భారీ ట్విస్ట్

సంచలనం: 139మంది రేప్ కేసులో భారీ ట్విస్ట్

139 persons rape case latest update

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 139 మంది తనపై అత్యాచారం చేశారని నల్గొండకు చెందిన యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలంగాణలో సంచలనమైంది. ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు కీలక విషయం రాబట్టినట్టు సమాచారం. సీసీఎస్ పోలీసులు సీరియస్ గా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే బాధితురాలు చాలా మంది ప్రజాప్రతినిధులు, వారి పీఏలు, సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, ప్రముఖుల పేర్లను ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులు ఈ యువతి వెనుక ఎవరున్నారన్న దానిపై కీలక విషయం రాబట్టినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read : కేసీఆర్, హరీష్ రావు కన్నీళ్లు.. ఏమైంది?

యువతి పోలీసులకు  ఫిర్యాదు చేయడానికి సహకరించిన సోమాజిగూడలోని ‘గాడ్ పవర్’ అనే స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారని తెలిసింది. యువతిని ప్రేరేపించి ఈ కేసు పెట్టారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దీనివెనుక పెద్ద బ్లాక్ మెయిలింగ్ దందా ఉందని.. ‘డాలర్ భాయ్’ అనే మారు పేరుగల వ్యక్తినే ఇదంతా చేయించాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.

బాధిత యువతిని బంధీగా చేసుకొని డాలర్ బాయ్ అనే వ్యక్తి ఆరోపణలు చేసిన పలువురు సెలెబ్రెటీలకు ఫోన్ చేసి డబ్బులు బెదిరించిన ఆడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధిత యువతిని తన చెరలో ఉంచుకొని ‘డాలర్ బాయ్ ’ అనే వ్యక్తియే ఇదంతా చేయించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  యువతిని బందీగా చేసుకొని డాలర్ ఆమెతో ఈ 139మంది రేప్ చేశారని బ్లాక్ మెయిలింగ్ చేయించాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది.  డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు ఆడియో రికార్డింగ్ లు సోషల్ మీడియాలో బయటపడడంతో డాలర్ భాయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని తెలిసింది. దీంతో బాధిత యువతిని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలనే డాలర్ భాయ్ ఇదంతా చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : గ్రేటర్ పై కన్నేసిన బీజేపీ.. వ్యూహమెంటీ?

డాలర్ బాయ్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారని సమాచారం. అతడిపై ఇటీవలే భార్య కూడా కేసు పెట్టిందని పోలీసులు గుర్తించారు. అతడిపై నగరంలోనే కాదు.. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణల కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉద్యోగం కోసం నగరాలకు వచ్చిన యువతిని ట్రాప్ చేసి ఆమె విద్యార్హత పత్రాలను తన వద్ద ఉంచుకొని మానసికంగా.. శరీరకంగా వేధిస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్లు పోలీసుల విచారణ తెలిసినట్టు ప్రచారం జరుగుతోంది. డాలర్ భాయ్ కార్యాలయంలో పలు ఆడియో టేపులు కూడా ఉండడంతో పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం డాలర్ బాయ్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో బాధిత యువతి అతడి చెర నుంచి బయటపడింది. ఆమెను కులపెద్దలు రక్షించి ఆమె తల్లి వద్దకు చేర్చారు.‘తెలంగాణ యూత్ ఫోర్స్ ’ మాత్రం ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.  కాగా డాలర్ భాయ్ పేరుతో అమ్మాయిలను వలవేసి సెలెబ్రెటీల నుంచి డబ్బులు గుంజుతున్న ‘డాలర్ భాయ్’ కఠిన చర్యలు తీసుకోవాలని  సెలెబ్రెటీలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు కోరుతున్నాయి. అయితే డాలర్ భాయ్ సంగతిపై మీడియాలో వస్తున్న కథనాలపై పోలీస్ శాఖ ఇంతవరకు స్పందించలేదు.

Also Read : కొండ పోచమ్మ కథలు.. సిగ్గు.. సిగ్గు అంటున్న రేవంత్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular