Konda Surekha Issue : రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఎవరైనా సరే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పర్లేదు కానీ అలా కాకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఎవరిని పడితే వాళ్ళని దూషిస్తుంటే మాత్రం వాళ్లు సంపాదించుకున్న క్రేజ్ మొత్తం ఒక్క రోజులో ఒక్క మాటతో సమాప్తం అయిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా కొండా సురేఖ సంఘటన దానికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఆమె కేటీఆర్ ను దూషించాలనే ఉద్దేశ్యంతో హీరోయిన్ సమంత, నాగార్జున లను ఉద్దేశిస్తూ చాలా మాటలు మాట్లాడింది. దాంతో ఒక్కసారిగా ఆమె మీద వ్యతిరేకత అయితే పెరిగింది. నిజానికి ఈ సంఘటన జరగడానికి ముందు బిఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆమె మీద చేస్తున్న అక్రమమైన ఆరోపణలకు తన మీద సింపతీ అయితే పెరిగింది. అయితే ఆమె ఆ ఆరోపణలను తనకు అనుకూలంగా మార్చుకోకుండా కేటీఆర్ ని దూషించాలనే ఉద్దేశ్యంతో సమంత, అక్కినేని ఫ్యామిలీ మీద ఆరోపణలు చేసింది. దాంతో ఒక్కసారిగా ఆమె మీద సినీ సెలబ్రిటీలందరూ విరుచుకుపడుతున్నారు.
ఇక ప్రస్తుతం ఆమె బయటకు వచ్చి సారీ చెప్పినా కూడా ఈ సంఘటన అయితే అంత ఈజీగా సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే సినీ సెలబ్రిటీల మీద వ్యంగం గా మాట్లాడడం పంచులు వేయడం కామెంట్స్ చేయడం రాజకీయ నాయకులకు అలవాటైపోయింది.
ఇక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి. అంటే కొండా సురేఖ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు సైతం ఆమెను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఒక మంత్రి హోదాలో ఉండి ఆమె ఇలా మాట్లాడటం సరికాదనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఎన్నో సంవత్సరాలుగా రాజకీయంగా ఎదగాలనే ప్రయత్నం చేస్తూ వస్తున్న ఆమె ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్న తరుణంలో ఇలాంటి ఒక చిన్న పొరపాటు మాట వల్ల ఆమె ఎంటైర్ రాజకీయ జీవితానికే ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఎదురైంది.
అందుకే అధికారం చేతిలో ఉందని ఆలోచించకుండా మాట్లాడటాలు చేస్తే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయని చెప్పడానికి సురేఖని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇక మొత్తానికైతే కొండ సురేఖ సంఘటన ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం నేర్పిస్తుందనే చెప్పాలి…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More