HomeతెలంగాణSorghum: జొన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

Sorghum: జొన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

Sorghum: మీరు జొన్న పంట పండిస్తున్నారా? తెలంగాణలోనే ఉంటారా? అయితే శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం జొన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. జొన్న రైతుల నుంచి 8 క్వింటాల్లు మాత్రమే కాదు 12 క్వింటాళ్ల వరకు జొన్నను కొనాలని మార్క్‌ఫెడ్‌ని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మెదక్ జిల్లా రైతులకు మేలు కలిగేలా, ప్రభుత్వ వ్యవసాయ, సహకారశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

మెదక్ జిల్లా రైతులకు ఈ యాసంగి 2023-24లో ఎకరాకి 12 క్వింటాళ్ల జొన్న దిగుబడి వచ్చిందట. ఐతే.. రైతుల నుంచి 8 క్వింటాళ్ల వరకే కొనాలని ఇదివరకు నిబంధనలు ఉండేవి. వాటి వల్ల రైతులకు నష్టం కలుగుతుందని భావించి ఆ నిబంధనలను సవరించి రైతులకు మేలు చేస్తుంది ప్రభుత్వం.

గతంలో మెదక్ జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రతి ఎకరాకీ 8 క్వింటాళ్ల జొన్నలను మాత్రమే కొనేవారు. దీని వల్ల రైతులు ఇబ్బందులు పడేవారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర రాజనరసింహ, వ్యవసాయ శాఖ కార్యదర్శికి లేఖ రాసి సమస్యను పరిష్కరించాలి అని కోరారు. ఆ లేఖకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి వెంటనే స్పందించి.. ఒక్కో రైతు నుంచి మార్కెఫెడ్ ద్వారా జొన్న కొనుగోళ్లను 8 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లకు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇన్ని రోజులు కేవలం 8 క్వింటాల్లు మాత్రమే అమ్మి మిగిలిన వాటిని ఎక్కడ అమ్మాలో తెలియక ఇబ్బంది పడేవారట రైతులు. చాలా మంది ఆ పంటను రోడ్లపై, మార్కెట్లలో అలాగే వదిలేసేవారు. ఇప్పుడు మంత్రి దామోదర రాజనరసింహ తీసుకున్న ప్రత్యేక చొరవతో తమకు మేలు జరుగుతుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నిర్ణయం వల్ల వారు అప్పుల నుంచి విముక్తి పొందుతున్నాం అంటూ కొనియాడుతున్నారు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular