HomeతెలంగాణCM Revanth Reddy: రేవంత్‌ ప్రచారం.. హైకమాండ్‌ ఫిదా

CM Revanth Reddy: రేవంత్‌ ప్రచారం.. హైకమాండ్‌ ఫిదా

రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా లేవనెత్తుతున్న కొన్ని అంశాలు సంచలనం అవుతున్నాయి. వాటినే హైలేట్‌ చేస్తున్నారు. ఇవి బీజేపీకి ఇబ్బందిగా మారతున్నాయి.

CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అధిష్టానం ప్రశంసలు కురిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలో ప్రచారంలో రేవంత్‌ లేవనెత్తుతున్న అంశాలు అధికార బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ తెలంగాణతోపాటు సౌత్, నార్త్‌ ఇండియాలో ప్రభావం చూసుతోంది. దీంతో రేవంత్‌ క్యాంపెయిన్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం ఫిదా అవుతోంది.

హైలేట్‌ అవుతున్న అంశాలు..
రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా లేవనెత్తుతున్న కొన్ని అంశాలు సంచలనం అవుతున్నాయి. వాటినే హైలేట్‌ చేస్తున్నారు. ఇవి బీజేపీకి ఇబ్బందిగా మారతున్నాయి. అలాంటి వాటిలో రిజర్వేషన్ల రద్దు అంశం ఒకటి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయన్న అంశాన్ని రేవంత్‌ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇందుకు ఆధారాలను కూడా చూపుతున్నారు. బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ వందేళ్ల ఎజెండా రిజర్వేషన్ల రద్దు అని ప్రచారం చేస్తున్నారు.

చార్‌సౌ పార్‌ అందుకే అని..
ఇక రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందనడానికి మరో కారణం కూడా హైలేట్‌ అవుతోంది. ఇందులో బీజేపీ నినాదమే రేవంత్‌కు ఆయుధంగా మారింది. బీజేపీ చార్‌ సౌ పార్‌ నినాదం అందుకే అని రేవంత్‌ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తక్కువ మెజారిటీ వస్తే రిజర్వేషన్ల రద్దుకు ఆటంకం కలుగుతుందని 400 సీట్లు అడుగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈవాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

క్లారిటీ ఇస్తున్న బీజేపీ..
ఇక రేవంత్‌ చేస్తున్న రిజర్వేషన్ల రద్దు ప్రచారంపై బీజేపీ అలర్ట్‌ అయింది. రేవంత్‌ ఆరోపణలు తిప్పి కొట్టడంతోపాటు ఆ పార్టీ నేతలు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు రేవంత్‌ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సౌత్‌ ఇండియాతోపాటు నార్త్‌ ఇండియాలోనూ రేవంత్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇది కాంగ్రెస్‌కు ఎన్నికల్లో మేలు చేస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్‌ ను ఏఐసీసీ అగ్రనేతలు అభినందించినట్లుగా సమాచారం. బీజేపీ వైఖరిని మరింత ఎండగట్టాలని, పార్టీ నుంచి సహకారం ఉంటుందని అధిష్టానం భరోసా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper