HomeతెలంగాణKTR: గులాబీ తుఫాను రాగం... కేటీఆర్‌ రాజకీయ జోష్యం

KTR: గులాబీ తుఫాను రాగం… కేటీఆర్‌ రాజకీయ జోష్యం

KTR రాజకీయాల్లో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కొత్త పదజాలం, ఆకర్షణీయ విశేషణాలు అవసరం. ఈ విషయంలో కల్వకుంట్ల(Kalvakuntla) కుటుంబం తనదైన ముద్ర వేసింది. కేసీఆర్‌(KCR)తో పాటు కేటీఆర్‌ కూడా తన ప్రత్యేకమైన పదప్రయోగాలతో ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. తాజాగా కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

KTR: బీఆర్‌ఎస్‌(BRS)ను సాధారణంగా గులాబీ పార్టీగా పిలుస్తారు. గులాబీ సున్నితమైనదైనా, కేటీఆర్‌ దాన్ని తుఫానుతో పోల్చి, పార్టీ బలాన్ని చాటాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, తమ పార్టీ శక్తివంతంగా తిరిగి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఇంకా రెండేళ్లు కాలేదు. అయినా, బీఆర్‌ఎస్‌ నేతలు ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. కేటీఆర్‌(KTR) ఇప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. ఈ వాదనలో ప్రజల్లో కాంగ్రెస్‌పై అసంతృప్తి ఉందన్న వారి ఆలోచన ప్రతిఫలిస్తోంది.

Also Read: తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల కొట్లాట.. సీఎల్పీ అత్యవసర భేటీ

కాంగ్రెస్‌ కౌంటర్‌..
కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌ వాదనలను తిప్పికొడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటూ గెలవలేదని గుర్తు చేస్తూ, వారి ధీమా అతిశయోక్తి అని విమర్శిస్తున్నారు. 2028 వరకు తాము అధికారంలో ఉంటామని కాంగ్రెస్‌ నమ్మకంగా చెబుతోంది. విశ్లేషకులు మాత్రం, ప్రస్తుత అసంతృప్తి ఎన్నికల సమయానికి మారవచ్చని, ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేదని అంటున్నారు.

ఎన్నికలు ఎప్పుడు, ఎందుకు?
బీఆర్‌ఎస్‌ తమ పార్టీ గ్రామీణ స్థాయిలో బలంగా ఉందని, కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయని వాదిస్తోంది. అయితే, ఒక పార్టీ కోరుకుంటేనే ఎన్నికలు రావని, రాజకీయ వాతావరణం అంత సులభంగా మారదని విమర్శకులు అంటున్నారు. రాజకీయ జోస్యాలతోపాటు జనాల మూడ్‌ను అర్థం చేసుకోవడం కీలకం.

 

Also Read: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. 55,418 పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper