HomeతెలంగాణKalvakuntla Kavitha: కొడంగల్ లో 33 వేల అక్రమ ఓట్లు.. కర్ణాటక ఓట్లతోనే రేవంత్ గెలిచారట..

Kalvakuntla Kavitha: కొడంగల్ లో 33 వేల అక్రమ ఓట్లు.. కర్ణాటక ఓట్లతోనే రేవంత్ గెలిచారట..

Kalvakuntla Kavitha: కొడంగల్ లో 33 వేల అక్రమ ఓట్లు ఉన్నాయా.. కర్ణాటక ప్రజల ఓట్ల తోనే రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో గెలిచారా.. దీనికి ఎన్నికల సంఘం కూడా సహకరించిందా.. సరిగ్గా ఇవే మాటలు చెబుతున్నారు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత.. ఆమె చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారాయి. 2018 నుంచి 2023 వరకు కొడంగల్ లో మొత్తం 30 వేల కొత్త ఓట్లు చేర్చారని ఆమె ఆరోపించిన తీరు సరికొత్త చర్చకు దారితీస్తోంది.

కొడంగల్ నియోజకవర్గం లో 22 వేలకు పైగా నకిలీ ఓట్లు ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని కావిత ఆరోపించారు. అంతేకాదు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సడం నియోజకవర్గంలోని 11 వేల ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో నమోదయ్యాయని కవిత సరికొత్త విషయాన్ని తెరమీదికి తీసుకొచ్చారు. 33,000 ఓట్లు అక్రమంగా ఉన్నాయని.. రేవంత్ రెడ్డి ఏకంగా 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని కవిత ఆరోపించారు. “రేవంత్ గెలుపు వెనుక కర్ణాటక ఓటర్లు ఉన్నారు. అక్కడి నుంచి ఓటర్లను తీసుకువచ్చారు. అందువల్లే ఆయన గెలిచారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని ముందుగానే కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గెలవడానికి ఆయన అనేక అడ్డదారులు తొక్కుతున్నారు.. దీనికి ఎన్నికల సంఘం కూడా సహకరిస్తుందని” కవిత ఆరోపించారు.

కొడంగల్ నియోజకవర్గంలో 800 ఓట్లు మాత్రమే తొలగించారని.. బోధన్ నియోజకవర్గంలో ఏకంగా ఏడు వేల ఓట్లు తొలగించారని కవిత పేర్కొన్నారు. అంతేకాదు, దాదాపు లక్ష ఓట్ల వరకు కొడంగల్ నియోజకవర్గంలో మోడిఫికేషన్ జరిగిందని కవిత ఆరోపించారు. ఇవి సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు..”తెలంగాణ డబ్బులను కర్ణాటకకు పంపిస్తున్నారు. ఓటర్లను తీసుకొస్తున్నారు. చివరికి డబ్బుతో పాటు ఓట్లను కూడా బదిలీ చేశారు.. రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరించింది” అనే అనుమానాలు తమకు కలుగుతున్నాయని కవిత ఆరోపించడం విశేషం.

“ఓ నటుడికి మూడు రాష్ట్రాలలో ఓటు హక్కు ఉంది. ఆయన ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనకు మూడు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని.. వాటిని తొలగించడానికి ఏడు సంవత్సరాలు పట్టిందని” కవిత ఆరోపించడం విశేషం. ఇటువంటి ఓటర్లను తొలగించకపోతే ఎస్ ఐ ఆర్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చి ఉపయోగం లేదని కవిత పేర్కొన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper