Indur Municipal Corporation elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మరో కీలక కార్పొరేషన్ నిజామాబాద్(ఇందూరు). తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ మూడు ఎమ్మెల్యేలను గెలిచింది. ఇక లోక్సభ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ రెండోసారి ఎంపీగా గెలిచారు. ఇందూరుపై పట్టు సాధించారు. దీంతో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్యే గట్టి పోటీ నడుస్తోంది. పదేళ్లు పుర పీఠం దక్కించుకున్న బీఆర్ఎస్ ఈసారి మరింత డీలాపడింది.
అన్నీ రవిందే..
మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ బలంగా కనిపిస్తోది. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఉండడం బీజేపీకి ప్లస్. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం అదనపు బలం. ఇక ఇక్కడ కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించింది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ ధర్మపురి అరవింద్ అన్నీ తానై చూసుకుంటున్నారు. ఇందూరు బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికలోనూ ఆయనే కీలకంగా వ్యవహరించారు. గత ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ 28 కార్పొరేటర్లను గెలిచింది. బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చింది. ఈసారి కచ్చితంగా గెలుస్తుందన్న అభిప్రాయం ప్రజల్లోనూ ఉంది. 60 డివిజన్లు ఉన్న బల్దియాలో 35 నుంచి 40 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది.
కాంగ్రెస్ గట్టి పోటీ..
ఇక నిజామాబాద్లో కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఆ పార్టీకి కలిసి వస్తోంది. ఇక సీఎం రేవంత్రెడ్డి నిజాబాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం సభ నిర్వహించారు. బైపాస్ మంజూరు చేస్తానని, విమానాశ్రయం తెస్తానని పట్టణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా కష్టపడుతున్నారు. అయితే కాంగ్రెస్ ఈసారి 20 నుంచి 25 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా.
ఎంఐఎం కీలకం..
గత మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్లో 16 కార్పొరేషన్లు గెలిచింది. బీఆర్ఎస్ 13 స్థానాలు గెలిచింది. ఇక్కడ హిందూఇజం ఎంత బలంగా ఉందో.. ముస్లింలు కూడా అంతే బలంగా ఉన్నారు. దీంతో ఈసారి కూడా ఎంఐఎం 10 నుంచి 15 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్, ఎంఐఎం అవాగాహన ఉండడం ఎంఐఎంకు ప్లస్పాయింట్.
నామమాత్రంగా బీఆర్ఎస్..
ఇక ఇందూరులో బీఆర్ఎస్ పోటీ ఈసారి నామమాత్రమే కాబోతోంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పెద్దగా ఏమీ చేయలేదన్న అభిప్రాయం ఉంది. ఇక ఈసారి రాష్ట్రలో అధికారంలో లేకపోవడం ఆ పార్టీకి మైనస్. ఇంకా పెద్దమైనస్ అంటే.. కేసీఆర్ తనయ, నిజాబాబాద్ కోడలు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం ఆ పార్టీకి పెద్ద మైనస్. దీని ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ 5 నుంచి 10 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంది.
