తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్ష ఫలితాలను శనివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. మొత్తం 63,857 అభ్యర్థులకు గాను 59, 113 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాలకు వేర్వేరుగా గత నెల 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. కాగా ఈనెల 6న ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదలయ్యాయి.