
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు పెరిగాయి. వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,136 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,53,651 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,390గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,34,234 మంది కోలుకోగా ప్రస్తుతం 18,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 15,205 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 47,29,401గా ఉంది.