హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ తరుణంలో ముషీరాబాద్ లో అపార్టుమెంట్లోకి భారీగా వరదనీరు చేసింది. అయితే ఆ సమయంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి అపార్ట్ మెంట్ సెల్లార్ లోనే చిక్కకున్నాడు. దీంతో వరదనీటి తాకిడికి ఆయన మరణించాడు. రాజ్ కుమార్ హైకోర్టులో పనిచేస్తన్నట్లు సమాచారం. నిన్న సాయంత్రం కురగాయల కోసం బయటకు వెళ్లేందుకు బైక్ కోసం సెల్లార్ లోకి వచ్చిన రాజ్ కుమార్ భారీ వర్షం రావడంతో అక్కడే ఉండిపోయాడు. అయితే ప్రమాదవశాత్తూ అయన అక్కడే మరణించాడు. కాగా రాజ్ కుమార్ మ్రుతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.