హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణ సమయాన్ని పొడిగించారు. రేపటి నుంచి ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఉదయం 7 గంటలకు మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యేవని.. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు 30 నిమిషాలు ముందుగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక రాత్రి సమయంలో ఎలాంటి మార్పుల్లేవని.. గతంలోలాగే చివరి ట్రైన్ రాత్రి 9.30 గంటలకు ఉంటుందని స్పష్టం చేశారు