తెలంగాణలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున పోలీసులు ముందుగానే ప్రతిపక్షాల నాయకులను హౌస్ అరెస్టు చేశారు. సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ నాయకులు యత్నించారు. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం ఉదయం ఆయా పార్టీల నాయకులు ఇళ్లలోకి వెళ్లి హౌస్ అరెస్టు చేశారు. సీపీఐ నాయకుడు నారాయణను హౌస్ అరెస్టు చేశారు. ఇక బీజేపీ నాయకులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు.కాగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద దూసుకు వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లా అయిన కరీంనగర్లో స్థానిక బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.