కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామానికి చెందిన ఇరుకుల్ల నర్సయ్యను గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో గొంతు కోసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ లోని 43 బైపాస్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతుడు ట్రాక్టర్ డ్రైవర్ అని తెలుస్తోంది.