
తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కేసులు కాస్త పెరిగాయి. వైద్య, ఆరోగ్యశాఖ శనివారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 596 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,72,719 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,470గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,62,751 మంది కోలుకోగా ప్రస్తుతం 8,498యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 6465 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 59,471 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.