
తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి.. వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 551కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,80,195 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,506గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,71,649 మంది కోలుకోగా ప్రస్తుతం 7,040యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 4,955 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 47,991 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.