
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,579 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,26,124 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,287గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,04,388 మంది కోలుకోగా ప్రస్తుతం 20,449 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 17,071 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.