
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,058కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,60,834 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,419గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,46,733 మంది కోలుకోగా ప్రస్తుతం 12,682 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 10,352 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. కాగా 24 గంటల్లో 38,757 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రెండు మూడు రోజుల నుంచి కరోనా కేసులు నిలకడగా ఉంటున్నాయి. అయితే పట్టణాలో స్వల్పంగా కేసులు నమోదు కావడంతో జాగ్రత్తలుపాటించాల్సిందేనని వైద్యాధికారులు సూచిస్తున్నారు.