కరోనా అన్ని సేవలు బంద్ అయిన వేళ వొడాఫోన్, ఐడియా వినియగదారులకు శుభవార్త. తన సబ్స్క్రైబర్లకు ప్రిపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని పెంచుతున్నట్లు ఆయా కంపెనీల యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్న అల్పాదాయ కస్టమర్లకు మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది. ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్న అల్పాదాయ కస్టమర్లకు ప్రిపెయిడ్ రీచార్జ్ వ్యాలిడిటీని పొడిగిస్తున్నామని వోడాఫోన్ ఐడియా తెలిపింది. ఏప్రిల్ 17 వరకు ఈ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొంది.
దీంతో రీచార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ అయిపోయినా కూడా కస్టమర్లకు ఇన్కమింగ్ కాల్స్ పొందొచ్చు. సాధారణంగా ప్లాన్ వ్యాలిడిటీ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ రావు. అంతేకాకుండా వొడాఫోన్ ఐడియా మరో ఆఫర్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. వీరికి రూ.10 ఉచిత టాక్టైమ్ ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ పరిస్థితుల్లో కస్టమర్లకు ఈ ఉచిత టాక్ టైమ్ అందిస్తున్నామని, వారు వారి కుటుంబ సభ్యులతో అనుసంధానమై ఉండొచ్చని కంపెనీ వివరించింది.
కాగా వొడాఫోన్ ఐడియా దారిలోనే ఎయిర్టెల్ కూడా నడిచింది. ఎయిర్టెల్ కూడా తన కస్టమర్లకు ఇలాంటి బెనిఫిట్స్నే అందించింది. 8 కోట్ల మంది సబ్స్క్రైబర్లకు ప్రయోజనం కలుగుతుందని ఎయిర్టెల్ తెలిపింది. అలాగే ప్రభుత్వ రంగ టెలికం కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కూడా ఇలాంటి ఆఫర్లనే అందించాయి. ఏప్రిల్ 20 వరకు ఈ వాలిడిటీని పొడిగించాయి. రూ.10 ఉచిత టాక్టైమ్ ఆఫర్ చేస్తున్నాయి. జియో కూడా ఇదే బాట పట్టింది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Free talk time is being offered to customers in lockdown situations
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com