Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ కి జాతీయ జట్టులో చోటు లభించినప్పటికీ.. తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం లభించడం లేదు. అతడి ఎంట్రీ కోసం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ మేనేజ్మెంట్ అతని విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. వాస్తవానికి ఐర్లాండ్ సిరీస్ లోనే అతడు జాతీయ జట్టులో ఆడాల్సి ఉండగా.. సీనియర్లు ఉన్నారు అనే సాకుతో మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టింది.
సూర్య వంశీ ప్రస్తుతం తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ట్రై సిరీస్లో శ్రీలంక జట్టు మీద ఫైనల్ మ్యాచ్లో వీర విహారం చేశాడు. టీమిండియాను విజేతగా నిలిపాడు. అయితే అతడు ఆ స్థాయిలో ఆడుతున్నప్పటికీ మేనేజ్మెంట్ బ్రేకులు వేస్తోంది. సీనియర్లు ఉన్నారని అతడికి అవకాశాలు ఇవ్వడం లేదు.
ఐర్లాండ్ సిరీస్ లో టీమిండియా దారుణంగా ఓడిపోవడం.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో సంజు.. కిషన్ విఫలం కావడంతో మరోసారి సూర్య వంశీ గురించి చర్చ మొదలైంది. సూర్య వంశీ రెండవ మ్యాచ్లో ఆడాలని.. అతడికి అవకాశం కల్పించాలని సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిరా సాగుతుండగానే సూర్య వంశీ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశాడు.. న్యూ చాప్టర్ అంటూ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై ఆడిన ఇన్నింగ్స్ ఫోటోలను స్టోరీలో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో వైభవ్ రెండవ టి20 లో ఆడతాడని సంకేతాలు ఇస్తున్నాడా.. లేదా జస్ట్ ఆ ఇన్నింగ్స్ ను గుర్తుకు తెచ్చుకుంటున్నాడా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. నాడు ఆ ఇన్నింగ్స్ లో సూర్య వంశీ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు కొట్టాడు.
నేడు జరిగే మ్యాచ్లో సంజు కు గనుక విశ్రాంతి ఇస్తే సూర్య వంశీకి చోటు లభించే అవకాశం ఉంది. ఒకవేళ కిషన్ ను కనుక పక్కన పెడితే అప్పుడు సూర్య వంశీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఐర్లాండ్ సిరీస్లో సంజు ఆకట్టుకోలేదు. కిషన్ అదరగొట్టలేదు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా కిషన్.. సంజు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్లో ఎలాగైనా సరే టీమిండియా గెలవాలి కాబట్టి.. సూర్య వంశీకి అవకాశాలు ఇచ్చే విషయాన్ని మేనేజ్మెంట్ తీవ్రంగా పరిశీలిస్తుందని.. అందువల్లే సూపర్ కిడ్ ఇన్ స్టా గ్రామ్ లో ఆ తరహా పోస్టులు పెట్టాడని స్పోర్ట్స్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
View this post on Instagram

