Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi 94 Runs: ఫైనల్ అంటే చాలు.. సూర్య వంశీ 2.0 చూపిస్తాడు

Vaibhav Suryavanshi 94 Runs: ఫైనల్ అంటే చాలు.. సూర్య వంశీ 2.0 చూపిస్తాడు

Vaibhav Suryavanshi 94 Runs: సాధారణంగా ఏ క్రికెటర్ అయినా సరే.. ఫైనల్ మ్యాచ్ అంటే భయపడిపోతుంటాడు. అప్పటిదాకా గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఫైనల్ అనగానే కంగారు మొదలవుతుంది.. ఒత్తిడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్వయంకృతాపరాధం వల్ల వికెట్ కోల్పోవాల్సి ఉంటుంది. కానీ వైభవ్.. సూర్య వంశీ రేంజ్ వేరు. ఫైనల్ అనగానే అతడు ఒకసారిగా మారిపోతాడు.

ప్రస్తుతం జరుగుతున్న ట్రై సిరీస్ లో సూర్య వంశీ అంత గొప్పగా ఆడలేదు. తన స్థాయి బ్యాటింగ్ చేయలేదు. దీంతో అతని మీద విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా శ్రీలంక ఆటగాళ్ల మీదికి అతడు దూసుకుపోయిన తీరు ఒకరకంగా విమర్శలకు కారణమైంది. ఇంత చిన్న వయసులో అతడు కోపాన్ని తగ్గించుకోవాలని.. దూకుడు తనాన్ని చూపించకూడదని.. బ్యాటింగ్ చేసే క్రమంలో కాస్త సమయమనాన్ని పాటించాలని సీనియర్ ప్లేయర్లు.. మాజీ ప్లేయర్లు సూచించారు.

సూర్యవంశం అలా దూకుడుగా వెళ్లిపోవడం పట్ల కొంత మంది అభిమానులు మెచ్చుకున్నప్పటికీ.. మిగతావారు మాత్రం అతడి తీరును విమర్శించారు. అతడిది చిన్న వయసు అయినప్పటికీ.. జెంటిల్మెన్ లాంటి క్రికెట్ గేమ్ ఆడుతున్నప్పుడు.. కచ్చితంగా ఆ హుందాతనాన్ని పాటించాలని సూచించారు. సూర్య వంశీ తనను ఆ స్థాయిలో శ్రీలంక ప్లేయర్లు ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో.. తన బ్యాటింగ్ స్టైల్ అంటే ఎలా ఉంటుందో వారికి చూపించాడు. కేవలం 29 బంతుల్లో.. 94 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉన్నాయి. సెంచరీ ముందు అవుట్ కావడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.

సూర్య వంశీ.. మరో ఓపెనర్ ఆర్యతో కలిసి ఏకంగా తొలి వికెట్ కు 132 పరుగులు జోడించాడు. అది కూడా కేవలం 8.5 ఓవర్లలో.. వన్డే క్రికెట్ ను టి20 మాదిరిగా ఆడాడు సూర్య వంశీ. అతడి దెబ్బకు శిరాజ్ 43, సాహన్ 20, దులాజ్ 33, కుగాత 29, ఫెర్నాండో 18 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇందులో ఆర్య చేసిన పరుగులు కూడా ఉన్నాయి.

సూర్య వంశీ ఫైనల్ మ్యాచ్ అనగానే రెచ్చిపోతుంటాడు.. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మీద సూర్య వంశీ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇటీవరి ఐపీఎల్ లో ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు మీద కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేశాడు. గుజరాత్ జట్టుమీద క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో 47 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. తాజాగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. 15 సంవత్సరాల వయసులోనే అతడు ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద ప్లేయర్లు కూడా చేయలేని అద్భుతాన్ని అతడు.. చేతల్లో చేసి చూపిస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular