Homeక్రీడలుక్రికెట్‌India Vs England Semi Final Practice: ఆకాశంలో చంద్ర గ్రహణం.. టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్...

India Vs England Semi Final Practice: ఆకాశంలో చంద్ర గ్రహణం.. టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ ను పక్కన పెట్టి ఏం చేశారంటే?

India Vs England Semi Final Practice: సాధారణంగా మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తే ఎవరైనా తుమ్మితే ఆగిపోతాం. పిల్లి ఎదురుగా వస్తే ప్రయాణాన్ని కొద్దిసేపు నిలిపివేస్తాం. బల్లి లేదా కుక్క లాంటి జంతువు ప్రమాదానికి సంకేతంలాగా అరిస్తే ఆగిపోతాం. చాలామంది వీటిని మూఢనమ్మకాలు అంటుంటారు. కానీ మెజారిటీ ప్రజలు వీటిని కచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. కొన్ని కొన్ని నమ్మకాలను టీమ్ ఇండియా ప్లేయర్లు కూడా పాటిస్తుంటారు. మంగళవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడింది. గ్రహణం నేపథ్యంలో చాలావరకు ఆలయాలను మూసివేశారు. గ్రహణం వీడిపోయిన తర్వాత ఆలయాలను తెరిచి శుద్ధి చేశారు. టీమిండియా ప్లేయర్లు కూడా దాదాపుగా అలాంటి పని చేశారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కోసం టీం ఇండియా ప్లేయర్లు ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్లేయర్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉండేది. గ్రహణం వల్ల షెడ్యూల్ టైమింగ్స్ మొత్తం మార్చేశారు. ఇదే విషయంపై జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సాయంత్రం 6: 47 నిమిషాలకు గ్రహణం ముగిసిపోవడంతో.. ఏడు గంటల నుంచి ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

గ్రహణం సమయంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని.. అందువల్లే ప్లేయర్లు మైదానంలోకి దిగలేదని తెలుస్తోంది. “గ్రహణం సమయంలో ప్లేయర్లు మైదానం వెలుపల ఉన్నారు. సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. గ్రహణం ముగిసిపోయిన తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చారు.. ఇదే విషయాన్ని జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ప్లేయర్లు ఆధునికమైన భావాలు కలిగి ఉన్నప్పటికీ.. కొన్ని కొన్ని విషయాలలో సాంప్రదాయాలను పాటిస్తారని ఈ సంఘటన ద్వారా తెలిసిపోయింది. మరోవైపు ముచ్చటగా మూడోసారి వరుసగా సెమీఫైనల్ టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్ జట్టు మీద విజయం సాధించాలని భావిస్తుంది. 2022లో ఇంగ్లాండ్ జట్టు చేతిలో సెమీఫైనల్ లో టీమిండియా ఓడిపోయింది. 2024లో ఇంగ్లాండ్ జట్టును రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా ఓడించింది. 2007 తర్వాత దాదాపు 17 సంవత్సరాల అనంతరం టీమిండియా విజేతగా నిలిచింది. ఇప్పుడు సెమి ఫైనల్ వెళ్లిన నేపథ్యంలో.. టీమిండియా కచ్చితంగా ఇంగ్లాండ్ మీద విజయం సాధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఫైనల్ లో ప్రవేశించి విజేతగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper