Homeక్రీడలుక్రికెట్‌India vs England ODI Series: విరాట్, బుమ్రా కు చోటిచ్చారు సరే.. మా సిరాజ్...

India vs England ODI Series: విరాట్, బుమ్రా కు చోటిచ్చారు సరే.. మా సిరాజ్ ఏం పాపం చేశాడు..

India vs England ODI Series: “అతడికి అలుపు ఉండదు. సొలుపు కూడా ఉండదు. కెప్టెన్ ఏం చెప్తే అదే చేస్తాడు. ఎంతసేప బౌలింగ్ వెయ్యమన్నా సరే వేస్తూనే ఉంటాడు.. గాయపడినా భయపడడు. శరీరాన్ని తీవ్రంగా కష్టపడుతుంటాడు. చెమటలు చిందిస్తూ ఉంటాడు. అతనికి కావాల్సింది జట్టుకు అనుకూలమైన ఫలితం మాత్రమే. కెప్టెన్ ముఖంలో నవ్వు కనిపిస్తే అతడు మరింత రెచ్చిపోతాడు..”మహమ్మద్ సిరాజ్ గురించి టీం ఇండియా మాజీ క్రికెటర్లు తరచూ చేసే వ్యాఖ్యలు ఇవి.. గత ఏడాది ఇదే సమయానికి ఇంగ్లాండ్ సిరీస్లో టీమిండి అదరగొట్టినప్పుడు.. సిరాజ్ గురించి మాజీ ప్లేయర్లు గొప్పగా ప్రస్తావించారు. అతడిని ఆకాశానికి ఎత్తేశారు. అయితే అటువంటి సిరాజ్ ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కు దూరమయ్యాడు.

ఇంగ్లాండ్ సిరీస్ కు సిరాజ్ దూరం కావడం పట్ల అతడి అభిమానులు ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్ మైదానాల మీద సిరాజ్ కు అపారమైన అనుభవం ఉంది. గత ఏడాది జరిగిన టెస్ట్ సిరీస్లో బుమ్రా లేకపోయినప్పటికీ సిరాజ్ భారత బౌలింగ్ భారాన్ని మొత్తం ఒక్కడే మోసాడు. రోజుల తరబడి బౌలింగ్ వేసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొత్తాన్ని కుప్ప కూల్చాడు ఒక దశలో ఆకాష్.. ప్రసిద్ వంటి వారు గాయపడినప్పటికీ.. సిరాజ్ మాత్రం అలసిపోకుండా బౌలింగ్ వేశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా చివరి మ్యాచ్లలో టీమిండియా విజయం సాధించడానికి ప్రధాన కారణం సిరాజ్. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.

అయితే అంతటి సిరాజ్ ను జట్టులోకి తీసుకుపోకపోవడం పట్ల రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు అతడిని దూరం పెట్టారు. ఐర్లాండ్ సిరీస్ కు కూడా ఎంపిక చేయలేదు. వర్క్ లోడ్ వల్ల అతడికి విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందని మేనేజ్మెంట్ చెప్పింది. ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ అడుగులు వేస్తోంది. అలాంటప్పుడు బుమ్రా కు ఎందుకు అవకాశం ఇచ్చిందనేది అర్థం కావడం లేదు. ఇటీవలి ఐపీఎల్లో బుమ్రా గొప్పగా బౌలింగ్ చేయలేదు. అంతకుముందు టి20 వరల్డ్ కప్ లో కూడా తన స్థాయి ప్రదర్శన చేయలేదు. అలాంటప్పుడు అతనికి అవకాశం ఇచ్చి.. సిరాజ్ ను ఎందుకు దూరం పెట్టారో అర్థం కావడం లేదు.

విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్ టూర్ కు అవకాశం ఇచ్చారు. జట్టులోకి హర్షిత్ కూడా వచ్చేసాడు. అర్ష్ దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకున్నారు. బ్రార్ కూడా అవకాశం కల్పించారు. అలాంటప్పుడు సిరాజ్ ను ఎందుకు దూరం పెట్టారు అనేది అర్థం కావడం లేదు. అతడిని ఈ సిరీస్ కు మాత్రమే దూరం చేస్తారా.. లేదా వన్డే వరల్డ్ కప్ లో కూడా ఇలానే వ్యవహరిస్తారా అనేది అర్థం కావడం లేదు.. ఇంగ్లాండ్ టూర్లో టీమ్ ఇండియాకు గిల్ నాయకత్వం వహిస్తాడు. కోహ్లీ.. విరాట్.. రాహుల్.. కిషన్.. సుందర్.. అక్షర్.. నితీష్.. కులదీప్.. బుమ్రా.. ప్రసిద్.. హర్షిత్.. అర్ష్ దీప్.. బ్రార్ ను మేనేజ్మెంట్ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా కు ఇంగ్లాండ్ టూర్ పెద్ద ముఖ్యం కానుంది.

జూలై 14 బర్మింగ్ హమ్, జూలై 16న కార్డీప్, జూలై 19న లార్డ్స్ లో 3 వన్డేలు జరుగుతాయి. తొలి వన్డే మధ్యాహ్నం 3:30 నుంచి.. రెండవ వండే సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల నుంచి.. చివరి వన్డే మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular