IND vs ENG 3rd Test: ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు ముగిశాయి.హైద్రాబాద్ వేదికగా ఆడిన మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే, ఇక వైజాగ్ వేదిక గా ఆడిన రెండో మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే మూడోవ టెస్టు కోసం ప్లేయర్ల లగేజీలన్నింటిని సిబ్బంది రాజ్ కోట్ కి తరలిస్తుండగా, శ్రేయస్ అయ్యర్ లగేజ్ ను మాత్రం ఇంటికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతను వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. క్రీజ్ లో లో 30 బంతుల కంటే ఎక్కువగా ఎదుర్కొన్న సమయంలో తనకి వెన్నులో విపరీతమైన నొప్పి వస్తున్నట్లుగా బిసిసిఐ అధికారులకు తెలియజేశాడు. దాంతో కొద్ది వారాల పాటు తనకి విశ్రాంతిని ఇవ్వాలని బిసిసిఐ కోరుతున్నట్టుగా తెలుస్తుంది.
అందులో భాగంగానే తను ఇప్పటికే ఇంటికి వెళ్లిపోయినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అలాగే ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడేటప్పుడు కూడా తన గజ్జలలో కూడా నొప్పి వస్తునట్టుగా శ్రేయస్ అయ్యర్ తెలియజేశాడు.ఇక ఇలాంటి క్రమం లో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకి విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఇంకా మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్ లకు ఇతను అందుబాటులోకి వస్తాడా లేదా అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ లేదు. ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాట్స్ మెన్స్ అయిన రవీంద్ర జడేజా, కే ఎల్ రాహుల్ ఇద్దరు గాయాల బారిన పడి రెండో టెస్ట్ మ్యాచ్ కి దూరమయ్యారు. ఇక ఈ మ్యాచ్ టైం కి వాళ్లు టీమ్ లోకి వస్తారా లేదా అనే విషయాల మీద అయితే సరైన క్లారిటీ రావడం లేదు. ఇక ఇలాంటి క్రమంలో అయ్యర్ కూడా టీమ్ కి దూరం అవ్వడం బాడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇక అయ్యర్ ప్లేస్ లో రజత్ పటిదార్ కానీ, సర్ఫ రాజ్ ఖాన్ గానీ టీమ్ లో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి.మరి ఇలాంటి క్రమంలో ఇండియా మిగిలిన మ్యాచ్ ల్లో తన సత్తా చాటి గెలిస్తేనే ఈ సిరీస్ అనేది మన సొంతం అవుతుంది. ఇలాంటి టీమ్ నుంచి సీనియర్ ప్లేయర్లు అందరూ దూరమవుతుండడం నిజంగా ఇండియన్ టీం కి ఒక బాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక మిగిలిన మూడు టెస్టుల కోసం బిసిసిఐ మరో రెండు రోజుల్లో టీమ్ ని ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రాజ్ కోట్ వేదికగా మూడోవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది…