Preity Zinta family life and children: ప్రీతి జింటా.. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం తెలుగు తెరను ఆమె ఏలింది. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది. బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించింది. సొట్ట బుగ్గల సుందరిగా పేరు తెచ్చుకుంది. దక్షిణాదిలోని ఇతర చిత్ర పరిశ్రమలలో కూడా ఆమె నటించింది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది.
ఐపీఎల్ లో పంజాబ్ జట్టు ప్రమోటార్లలో తను కూడా ఒకరు. పంజాబ్ జట్టు ఈ స్థాయిలో ఆదరణ దక్కించుకోవడానికి ప్రధాన కారణం ప్రీతీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మ్యాచ్ ముగియగానే తన జట్టు ప్లేయర్లను ఆమె దగ్గరికి తీసుకొని అభినందిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ పంజాబ్ జట్టు సారధిగా వచ్చిన తర్వాత ప్రీతి జింటా ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. పంజాబ్ జట్టు అతని ఆధ్వర్యంలో వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ప్రీతి.. ఆనంద తాండవం చేస్తోంది.
ఇటీవల అయ్యర్ గురించి ప్రీతి కీలక వ్యాఖ్యలు చేసింది. అతడు తమ కుటుంబ సభ్యుడని వ్యాఖ్యానించింది. తన పిల్లలు అతడిని అన్నయ్య అని పిలుస్తారని పేర్కొంది. ప్రీతి వయసు ప్రస్తుతం 51 సంవత్సరాలు. తనకు 41 సంవత్సరాల వయసులో 2016లో అమెరికాకు చెందిన వ్యాపారవేత్త గూడె నాఫ్ ను పెళ్లి చేసుకుంది. సరోగసి విధానం ద్వారా 2021లో కవలలు జై (కుమారుడు), జియా (కుమార్తె) జన్మించారు. ప్రీతి రాజ్ పుత్ కుటుంబానికి చెందిన మహిళ. ఈమె తండ్రి ఆర్మీలో పని చేశారు. పంజాబ్ జట్టులో ఈమెకు 3450 కోట్ల రూపాయల వాటా ఉంది. తన భర్తతో కలిసి ప్రీతి అమెరికాలో ఉంటున్నది. అయినప్పటికీ ఆమె అక్కడి పౌరసత్వాన్ని తీసుకోలేదు. సోషల్ మీడియాలో ప్రీతి చురుకుగా ఉంటుంది. తన జట్టుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.
ఇటీవల సర్పంచ్ సాబ్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అతడు పోరాట యోధుడని కొనియాడింది. అతడి నాయకత్వంలో పంజాబ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని పేర్కొంది. అతడు నాయకత్వంలో పంజాబ్ జట్టు ఇంకా అభివృద్ధి చెందాలని ఆశించింది.. సినిమాలకు చాలా సంవత్సరాల క్రితమే గుడ్ బై చెప్పినప్పటికీ.. ఐపీఎల్ ద్వారా ప్రీతి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అందువల్లే ఆమెకు ఈ స్థాయిలో అభిమానుల అండదండలు లభిస్తున్నాయి..
