India Vs Australia World Cup Final: ఇక ఈరోజు జరిగే వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా రెండు టీమ్ లు కూడా గెలుపు కోసం బరిలోకి దిగుతున్న సమయాన ఇక ఈ మ్యాచ్ కోసం అతిరథ మహారధులు అందరూ కూడా గెస్టులు గా రాబోతున్నారు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.
అందులో ముఖ్యంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తనకి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన ప్లేయర్లని ఎంకరేజ్ చేయడానికి తను మ్యాచ్ చూడటానికి.వస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింధియా,ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్, ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, అమెరికా రాయబారి ఎరిక్ గస్సెట్టి, అస్సాం సిఎం హేమంత్ బిస్వా శర్మ, భారత్లోని ఆస్ట్రేలియా రాయబారి అయిన ఫిలిప్ గ్రీన్, రిలియన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు, బాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు తదితరు లు ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడటానికి అహ్మదాబాద్ కి చేరుకోనున్నారు…
ఇక దాంతో పాటు గా ఇవాళ్ళ జరిగే ఫైనల్ మ్యాచ్ కి ఇంతకు ముందు ఆయా దేశాల జట్లకు వరల్డ్ కప్ లు అందించిన మాజీ కెప్టెన్లు అయిన కపిల్ దేవ్, ధోనీ, క్లైవ్ లాయిడ్, అలెన్ బోర్డర్, స్టీ వ్వా, క్లార్క్, ఇయాన్ మోర్గాన్, పాంటింగ్ లాంటి దిగ్గజ కెప్టెన్లు కూడా ఈ మ్యాచ్ కి అతిధులుగా హాజరు కాబోతున్నారు…వీళ్ళు రావడం నిజంగా గ్రేట్ కప్పు అనుడుకున్న సారథులు అందరూ ఒకే వేదిక పైన ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…
ఇక పాకిస్థాన్ కి వరల్డ్ కప్ అందంచిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న కారణంగా ఆయన ఈ ఫైనల్కు రాలేక పోతున్నారు. కెప్టెన్ల కోసం బిసిసిఐ ప్రత్యేకమైన బ్లేజర్ను బిసిసిఐ తయారు చేయించింది. మాజీ కెప్టెన్లు ఈ బ్లేజర్ను వేసుకొని మ్యాచ్ ని చూడబోతున్నారు…
ఇక వీటితో పాటు ఈ మ్యాచ్ లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు…ఇక ఇప్పుడు జరగోబోతున్న వరల్డ్ కప్ ఫైనల్ కిఉందు జరిగే వాయుసేన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు పది నిమిషాల పాటు వైమానిక దళం చేసే ఈ విన్యాసాలు నా భుతో నా భవిష్యత్ అనే విధంగా ఉండేలా చాలా గొప్ప గా ప్లాన్ చేస్తున్నారు…9 ఎయిర్ క్రాఫ్ట్ల బృందం గల సూర్యకిరణ్ ఏక్రోబాటిక్ టీమ్ ఈ వేడుకల్లో కనువిందు చేయనుంది.ఇక వీటితో పాటు గా ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది
ఇక సంగీత ప్రదర్శన లో ప్రీతమ్, జోనితా గాంధీ, అమిత్ మిశ్రా, నకాష్ అజీజ్, తుషార్ జోషి వంటి స్టార్ సింగర్లు అలరించనున్నారు.మ్యాచ్ కి ముందు వాళ్ల పాట్ తో ప్లేయర్లు పాటు అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు..ఇక దాదాపు 500 మందికి పైగా డ్యాన్సర్లు తమ నృతంతో కనువిందు చేయనున్నారు.ఇక ఇవి ఒక ఎత్తు అయితే 90 సెకన్ల పాటు జరిగే లైట్షో, లేజర్షో ఫైనల్కు హైలైట్గా నిలువనుంది. అంతేగాక డ్రింక్స్ బ్రేక్, మొదటి ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో పలువురు సెలబ్రెటీలు తమ ప్రదర్శనతో అభిమానులను ఉర్రుతాలుగించనున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారీ స్థాయిలో బాణాసంచా, టపాసులు కాల్చనున్నారు.
ఇక ఇది ఇక ఉంటే దేశం లో ఉన్న సెలబ్రిటీ లు దాదాపు అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి అలాగే ఇక్కడ జరుగుతున్న వేడుకకి ఆటంకం జరగకుండా ఉండటానికి స్టేడియం పరిసరాల్లో కనువిని ఎరుగని రీతిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 60వేల మంది భద్రత సిబ్బంది భారీ బందోబస్తులో పాల్గొంటున్నారు.
నిజంగా ఇండియా లో ఈసారి నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన వరల్డ్ కప్ టోర్నీ ఇప్పటి వరకు ఏ దేశం లో కూడా నిర్వహించని విధంగా భారీ గా ఉండటం అనేది చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పాలి…