Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశి వారికి గౌరవం పెరుగుతుంది... నేటి (2023అక్టోబర్ 20న...

Rashi Phalalu: ఈ రాశి వారికి గౌరవం పెరుగుతుంది… నేటి (2023అక్టోబర్ 20న ) రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకరాం అక్టోబర్ 20 శుక్రవారం 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
వ్యాపారాల్లో ప్రణాళికలు అవసరం. కొన్ని పనులునిలిచినా తిరిగి పుంజుకుంటాయి. ప్రయాణాల ద్వారా కొంత సమాచారం పొందుతారు. దైవభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం:
కొన్ని విషయాల్లో సహనం అవసరం. తొందరపాటుతో చేసే పనులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు.

మిథునం:
ఈ రాశివారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఎవరిని నొప్పించకపోయినా మాటలు పడాల్సి వస్తుంది. దూకుడు స్వభావం తగ్గించుకుంటే మంచిది. కష్టపడి పనిచేసినా ఫలితం రాకపోయేసరికి నిరాశ ఉంటుంది.

కర్కాటకం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పెట్టుబడుల లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొందరి దగ్గరి నుంచి ముఖ్యమైన సమాచారం పొందుతారు. నాయకత్వ లక్షణాలు పొందుతారు.

సింహం:
ఈ రాశివారికి ఈరోజు పనిభారం ఎక్కువే. అయితే ఏ సమస్య నుంచి అయినా సులభంగా బయటపడుతారు. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటారు.

కన్య:
ఈరోజు వీరికి శుభదినం. ఉల్లాసంగా గడుపుతారు. వ్యక్తిగతంగా పనితీరును మెరుగుపరుచుకుంటారు. అనుభవాల నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. బ్యాంకు లావాదేవీలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి.

తుల:
ఈరోజు ఆహ్లదకర వాతావరణంలో గడుపుతారు. ఆస్తికి సంబంధించిన వివాదాల్లో ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొన్ని ఒప్పందాలను కోల్పోవచ్చు.

వృశ్చికం:
కుటుంబ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి. ఇతరులను సంప్రదించొద్దు. జీవనశైలిలో మార్పులు వస్తాయి. మీ ఆకర్షణ చూసి ప్రజలు మెచ్చుకుంటారు.

ధనస్సు:
ఇతరుల నుంచి శుభవార్త వింటారు. కొన్ని పనులు బాధ్యతతో చేయాలి. రక్తసంబంధాలు బలపడుతాయి. ఇంట్లో ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది.

మకరం:
మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దగ్గరివారి కోసం చేసే పనులు సక్సెస్ అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు. అవసరమైన పనిని త్వరగా పూర్తి చేయాలి.

కుంభం:
ఆర్థిక లక్ష్యాలపై ఫోకస్ పెడుతారు. ఆదాయం పెరుగుతుంది. పోటీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని విషయంలో ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు.

మీనం:
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తలపై జాగ్రత్తలు పాటించాలి. కార్యాలయాల్లో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ గురించి ఓ ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular