Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశి వారి సమస్యలు పరిష్కారం లభిస్తుంది.. నేటి రాశి ఫలాలు...

Rashi Phalalu: ఈ రాశి వారి సమస్యలు పరిష్కారం లభిస్తుంది.. నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 2న గురువారం ద్వాదశ రాశులపై ఆద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. నేటి 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఇంట్లో వివాహ కార్యక్రమాలు చేసేందుకు సహకరిస్తారు. పి్లల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

వృషభం:
కుటుంబంలో సమస్యలు ఏర్పడవచ్చు. సాయంత్రం జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది.

మిథునం:
గతంలో చేసిన రుణాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం:
జీవిత భాగస్వామి మాట వింటారు. ఆమె సలహాతో పెట్టుబడులు పెడుతారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది.

సింహం:
కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారం రంగంలోని వారు రాణిస్తారు. ఇతరుల నుంచి ఓ శుభవార్త వింటారు.

కన్య:
వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలి. లేకుంటే భవిష్యత్ లో సమస్యలు రావొచ్చు. ఆస్తి కొనుగోలుపై ఆచి తూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

తుల:
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.

వృశ్చికం:
వ్యాపారం కోసం ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వివాదాలను పరిష్కరించుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇతరులను ఊరికే నమ్మకూడదు.

ధనస్సు:
అప్పుల కోసం కొందరు ఇబ్బంది పెడుతారు. వ్యాపారులకు ప్రతికూల వాతావరణం. నగదు వ్యవహారాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.

మకరం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. పరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిపై కొంత ఆందోళన చెందుతారు. కొన్ని శుభవార్తలు వింటారు.

కుంభం:
తల్లిదండ్రుల ఆశీస్సులతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉన్నతాధికారులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ప్రతీ పనిలో విజయం సాధిస్తారు.

మీనం:
శత్రువలతో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఆదిపత్యం చెలాయించే ప్రమాదం ఉంది. కొన్ని బాధ్యతలు పూర్తి చేయడంలో ఆందోళన చెందుతారు. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular