Homeఆధ్యాత్మికంShani Jayanti 2025 : భరించలేని బాధలు ఉన్నాయా.. ఇలా చేస్తే శని నుంచి విముక్తి

Shani Jayanti 2025 : భరించలేని బాధలు ఉన్నాయా.. ఇలా చేస్తే శని నుంచి విముక్తి

Shani Jayanti 2025 : హిందూ సంప్రదాయంలో కొందరు ఎక్కువగా జాతకాలను నమ్ముతారు. ఒక మనిషికి మంచి జరగాలన్నా లేకపోయినా చెడు జరగాలన్నా కూడా శని ప్రభావం ఉంటుంది. జాతకంలో శని సరిగ్గా ఉంటే అదృష్టం కలసి వస్తుంది. అదే సరిగ్గా లేకపోతే చాలా బాధలు వస్తాయి. కొందరు తట్టుకోలేని బాధలను కూడా శని పెడుతుంది. అయితే ఈ శని సమస్యల నుంచి విముక్తి పొందాలంటే మీరు ఈరోజు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. దీనివల్ల జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే అన్ని బాధల నుంచి విముక్తి పొందాలంటే పాటించాల్సి పరిహారాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Also Read : అజ్ఞాతవాసంలో పాండవులు అక్కడే ఉన్నారా? ఆ మర్రి చెట్టు కు ఉన్న శేషనాగ్ లాంటి తలుపు రహస్యం ఏంటి?

వైశాఖ బహుళ అమావాస్య నాడు శని జయంతిగా నిర్వహించారు. మే 27వ తేదీ అనగా మంగళవారం ఈ రోజు వైశాఖ అమావాస్య శని జయంతిని జరుపుకుంటున్నారు. అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజలు చేయాలి. ఇలా చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఎవరి జాతకంలో అయినా శని బాధలు ఎక్కువగా ఉంటే తప్పకుండా ఈ శని జయంతి రోజు పూజలు నిర్వహించడం మంచిది. కొందరికి ఏలినాటి శని, అష్టమ శని ఉంటాయి. అలాంటి వారు కూడా శని జయంతి నాడు పూజలు నిర్వహించడం మంచిదని పండితులు చెబుతున్నారు. కొందరికి ఏ పని తలపెట్టినా కూడా ఆటంకం ఏర్పడుతుంది. ప్రతీ విషయంలో సమస్యలు వస్తాయి. అనుకున్న ఏ పని కూడా జరగదు. ఏదో రకంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు ఈ రోజు తప్పకుండా పూజలు చేయాలి.

ఈ శని జయంతి నాడు శుభ్రంగా తలస్నానం చేసి ఉపవాసం చేయాలి. ఇంట్లో పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలాగే శివాలయానికి వెళ్లి పూజలు చేయాలి. శనీశ్వరునికి పూజారితో తైలాభిషేకం చేయించాలి. శని దేవునికి నల్లని వస్త్రాలు సమర్పించి నల్ల నువ్వులతో అష్టోత్తర శతనామ పూజ చేయించుకోవాలి. అలాగే మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పూజ పూర్తి అయిన తర్వాత తమలపాకులో బెల్లం పెట్టి శని దేవునికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత నవ గ్రహాలకు తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి. అలాగే బ్రాహ్మణులకు తాంబూలాలు కూడా ఇవ్వాలి. అయితే ఉదయం పూట ఉపవాసం ఉండి రాత్రిపూట ఆహారం తీసుకోవాలి. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయడంతో పాటు కాకులకు, నల్ల చీమలకు ఆహారం అందించాలి. రోగులకు పండ్లు, పాలు, మందులు దానం జీవించి ఉన్నంత వరకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు దరిచేరవని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉల్లిపాయ, మాంసం తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Oktelugu Epaper