2012 డిసెంబర్ 16న నిర్భయ అనే వైద్య విద్యార్థినిని కదులుతున్న బస్సులో అతి దారుణంగా అత్యాచారం చేసి బస్సులో నుండి బయటకు విసిరేశారు. కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నిర్భయ తుది శ్వాస విడిచారు . అయితే ఈ ఘోరానికి పాల్పడిన వారు మొత్తం ఆరుగురు. అందులో ఒక వ్యక్తి (రామ్ సింగ్) జైలు గదిలో ఉరి పోసుకుని చనిపోగా, మిగిలిన ఐదుగురిలో నలుగురిని నిన్న తీహార్ జైలో ఉరి తీశారు. కానీ అసలు నిర్భయ చనిపోవటానికి కారణమైనా వ్యక్తి మాత్రం ఈ కేసు నుండి తప్పించుకోగలిగాడు. నిర్భయ చనిపోవటానికి అసలు కారణాన్ని వివరిస్తూ.. వైద్యులు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. నిర్భయ మర్మాంగాలలో ఇనుప రాడ్లు ఉంచడం వలన ఆమె కడుపులో పేగులు కదిలి చనిపోయినట్లు వాళ్లు వెల్లడించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది ముఖ్యంగా ఒక వ్యక్తి అని మిగిలిన నిందితులు పోలీసులకు చెప్పారు.
అతను మైనర్ కావడంతో 3 సంవత్సరాలపాటు జైల్ లో ఉంచి అతన్ని విడుదల చేశారు. నిర్భయను క్రూరంగా హింసించింది ఈ మైనరే. అతనిని ఆనంద్ విహార్ ప్రాంతంలో మర్నాడు ఉదయం నిర్బంధించిన పోలీసులు జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. నేర నిర్ధారణ కావడంతో మూడేళ్లు రిమాండ్ హోమ్ కి తరలించారు. మైనర్ అయినందున అతని వివరాలేవీ బయటకు వెల్లడించలేదు. మూడేళ్ల నిర్బంధం తర్వాత 2015 డిసెంబర్ లో అతనిని విడుదల చేశారు.
ఈ విషయంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. చట్టంలో మార్పులు చేసి మైనర్ వయసును పదహారేళ్లకు కుదించి ఆ మైనర్ కి కూడా శిక్ష పడాలని అనేకమంది డిమాండ్ చేశారు కానీ అలా జరగలేదు.
ప్రస్తుతం అతను ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు లో హోటల్ లో ఉంచినట్లు సమాచారం. నిర్భయ దోషులను మీడియా ముందుకు తీసుకువచ్చిన ప్రతిసారి ఆ మైనర్ ముఖాన్ని ముసుగుతో కప్పి ఉంచేవారు దీంతో అతను ఎవరో.. పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే అతనిపై పోలీసు నిఘా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.