Homeజాతీయ వార్తలుఢిల్లీలో మారణహోమం: 32కి చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీలో మారణహోమం: 32కి చేరిన మృతుల సంఖ్య


పౌరసత్వ సవరణ బిల్లు (సిఏఏ) కి వ్యతిరేకంగా గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనల సెగ ఢిల్లీకి తాకింది. దేశ రాజధానిలో మూడురోజులుగా కొనసాగుతున్న అల్లర్లు హింసాత్మంగా మారాయి. ఇప్పటివరకు 32 మంది చనిపోగా వందల మంది గాయపడ్డారు. వేలమంది సామాన్య ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు.

ఈశాన్య ఢిల్లీలో ప్రారంభమైన అల్లర్లు ప్రస్తుతం ఢిల్లీ మొత్తం వ్యాపించాయి. తీవ్రస్థాయి హింసాత్మక ఘటనలతో ఢిల్లీ అట్టుడుకుతుంది.
రాజధాని విధుల్లో వాహనాలు తగలబడుతున్నాయి, దుకాణాలు తెరవని పరిస్థితి, మూసేసిన ఇల్లు దర్శనమిస్తున్నాయి. సిఏఏ కి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లుగా భావిస్తున్న ఈ హింసకాండలో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతుంది. అలాగే గాయపడిన వారి సంఖ్య కూడా గంట గంట కి పెరుగుతుంది. దింతో సామాన్య ప్రజలు ఇళ్లలోని నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.

ప్రస్తుత నేపథ్యంలో రెచ్చ గొట్టే వ్యాఖ్యలు, విద్వేష పూరిత ప్రసంగాలు చేయొద్దని, అలాచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇందిరాగాంధీ హత్య సందర్బంగా 1984లో సిక్కులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన మారణహోమం మరలా పునరావృతం కాకుండా చూడాలని హైకోర్టు, అధికారులను ఆదేశించింది. అల్లర్లు, హింసాత్మంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత దోవల్ ని రంగంలోకి దించింది. ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించి ఢిల్లీలో అల్లర్లను అదుపుచేసే ప్రయత్నం చేసుతున్నారు. మరోవైపు పోలీసులు, భద్రత వ్యవస్థలు ఢిల్లీలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular