రైతుల ఆందోళనల్లో హింస చోటుచేసుకుంది. ఢిల్లీ సమీపంలోని తిక్రి సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొన్న ఒక వ్యక్తిపై నలుగురు ద్రావకం పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నిందితులు నలుగురు రైతు నిరసనల్లో పాల్గొన్నట్లు మృతుని సోదరుడు ఫిర్యాదు చేశారు. మృతుని ఝాజర్ జిల్లా బహదూర్ గఢ్ లోని కాస్రా గ్రామానికి చెందిన ముఖేష్ గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగినప్పుడు నిందితులు తాగిన మైకంలో ఉన్నట్లు ఫ్యిర్యాదుదారు పేర్కొన్నారు.