spot_img
Homeప్రత్యేకంAssembly by-election results : అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితం మిశ్రమంగా ఉంది - సమగ్ర...

Assembly by-election results : అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితం మిశ్రమంగా ఉంది – సమగ్ర విశ్లేషణ

Assembly by-election results : ఆరు రాష్ట్రాల్లో ఏడు ఉప ఎన్నికల్లో జరిగాయి. ఇండియా కూటమి మాదే విజయం అని సంబరాలు చేసుకుంది. కానీ ప్రజలు అంత అమాయులు కాదు. ఇవి అసెంబ్లీ ఉప ఎన్నికలు. వీటిని బట్టి 2024 పార్లమెంట్ ఎన్నికలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉన్నాయి. ఇక ఈ ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా ఏం లేవు.

మొత్తం 7 అసెంబ్లీ ఎన్నికల స్థానాల్లో 5 స్థానాల్లో వారే విజయం సాధించారు. మరణించిన కుటుంబ సభ్యులే గెలిచారు. వెస్ట్ బెంగాల్, త్రిపురలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి గెలుపు మారింది.

బెంగాల్ లోని దుప్ గురి ఒకప్పుడు బీజేపీ గెలవగా.. ఇప్పుడు టీఎంసీ గెలిచింది. అప్పుడు బీజేపీ కూడా 4వేల స్వల్ప మెజార్టీతోనే గెలిచింది. ఇప్పుడు టీఎంసీ కూడా 4వేల మెజార్టీతోనే గెలిచారు.

త్రిపురలోని బోక్సానగర్ సీపీఎం సీటు. ముస్లింలు మెజార్టీగా ఉండే సీటు. వీరు 50 శాతం అక్కడ ఉంటారు. సీపీఎం స్థానాన్ని ఈసారి బీజేపీ గెలిచింది. ముస్లిం నేత బీజేపీ తరుఫున ఎన్నికయ్యారు.

ఈశాన్యంలోని అతి చిన్న రాష్ట్రమైన త్రిపురలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు స్థానాలనూ బిజెపి గెలుచుకుంది. ధన్ పూర్, బాక్సా నగర్ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. బాక్సా నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి చెందిన టాపా జ్జాల్ హోసైన్ ఏకంగా 30,237 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.పోల్ అయిన ఓట్లలో 66% హోసైన్ కే పడటం విశేషం. ఆయన సమీప అభ్యర్థి మిజాన్ హోసైన్ కు( సీపీఐ(ఎం)) కు 3,909 ఓట్లు మాత్రమే పడ్డాయి.

ఇక ధన్ పూర్ నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థి దేబ్ నాథ్ విజయం సాధించారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉంటే ఈ నియోజకవర్గంలో బిందు 18,871 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలను ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేయాల్సి ఉంటుంది.

పశ్చిమ బెంగాల్ జల్ పాయ్ గురి జిల్లా ధూప్ గురి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్రరాయ్ 4,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2021 లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిలో మృతి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ భార్య తపసి రాయ్ ఇక్కడి నుంచి బిజెపి తరఫున పోటీ చేశారు. చంద్ర రాయ్ చేతితో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన సిపిఎం అభ్యర్థి ఐశ్వర్ చంద్రరాయ్ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు.

అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితం మిశ్రమంగా వుంది – సమగ్ర విశ్లేషణపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper