Homeజాతీయ వార్తలుPoverty: కనిపించని ఆ శత్రువెవరు ?

Poverty: కనిపించని ఆ శత్రువెవరు ?

Poverty : ఈ దేశం లో ఇంకా మెజారిటీ ప్రజలు గ్రామాల్లోనే జీవిస్తున్నారు. వారంతా దాదాపుగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపుగా 1980,90 దాకా భూస్వాములు ,దొరలు, ఊరిలో తమ అధికారం చెలాయించేవారు. అణిచివేతకు గురవుతున్న వారికి తమ స్తితికి కారణం ఎవరో ఎదురు గుండానే కనిపించే వారు . తమ పేదరికానికి కనపించని ఆ శత్రువెవరు? అని ఇప్పుడు పేదలు ప్రశ్నిస్తున్నారు.

proverty
Proverty

కానీ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, పీవీ నర్సింహారావ్ ప్రధానమంత్రి గా నూతన ఆర్థిక విధానాలు అమలు జరిపిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. మన తెలంగాణలో అయితే వామపక్ష ఉద్యమాల ఫలితంగా దొరలు గ్రామాలు విడిచి పట్టణాలకు వలసలు పోయి తమ వద్ద పోగుపడి ఉన్న సంపదలతో అక్కడ తమ వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకున్నారు. కొంత కాలం వరకు భూములు బీడుబడిపోయి గ్రామీణులకు ఉపాధి దొరుకక తమ దీన స్తితికి దొరలు లేక పోవడమే కారణం అనుకున్నారు. లబ్ధ ప్రతి స్టులైనా కొందరు కథకులు దానికి అనుకూలంగా కథలే రాసిపడే శారు. తరువాత తరువాత కొంత భూమి స్థానిక రైతుల చేతుల్లోకి మారింది. కానీ రైతులకు అర్థం కానీ విధంగా గిట్టుబాటు ధర లభించక పరిస్తితి పెనేం లో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారిపోయింది.

ఫలితంగా రైతు ఆత్మ హత్యలు పెరిగి పోయాయి. అందుకు కారణం ఎవడో రైతుల ముందు కనిపించడం లేదు. శత్రువు అదృశ్యం అయిండు. ఎవని తో పోరాడాలో అర్థం కానీ పరిస్తితి. ప్రభుత్వాలతో పోరాడితే, కొన్నీ పంటలకు మద్దతు ధర అన్నాయే కానీ గిట్టుబాటు ధర ఊసే లేదు. వామ పక్ష పార్టీలు సైతం తమ పోరాట బాణాలు ప్రభుత్వాల పైననే ఎక్కుపెట్టారు కాని అసలైన కారణం, ప్రభుత్వాలతో బాటు పెట్టుబడి దారి విధానం అంటూ పోరాడే శక్తులకు అర్థం చేయించ లేక పోయారు.

మొత్తం సమాజాన్ని చైతన్యవంతం చేయగలిగిన మంచి ఆయుధం అయిన విద్య ఇప్పుడు పెట్టిబడి దారుల చేతిలో పడి వారికి నైపుణ్యవంతమైన నౌకరీ గాళ్లను తయారుజేసే పనిలో తలమునుకలై ఉంది. సమాజం కూడా పోటీ పడి తమ పిల్లలు IIT, NEET, CIVILS, వేటలో పడి పెట్టుబడి కొరల పండ్లు దోమి ఎంతో కొంత మెరుగైన జీవితం అనుభవించాలే అన్న యావలో పడి కిందామీదా కొట్టుమిట్టాడుతున్నారు.

ఇక వైద్యం కూడా చాలా పిరపు సరుకు అయిపోయింది. ముందుగా పేదలకు బలవర్దకమైన ఆహారం లభించే పరిస్థితి లేదు. సమీకృత ఆహారం అంటే ఇంకా ఎందరికో తెలియని స్థితి. దానికి తోడు మల్టీ నేషనల్స్ ధనదాహం తీర్చే కొరకు వచ్చిన రసాయనిక ఎరువులు,పురుగు మందులు, హైబ్రిడ్ కల్తీ విత్తనాలు, కాలుష్యం అన్నీ కలిసి మనుషుల శరీరాలను రోగ గ్రస్తం చేస్తున్నాయి.

ప్రజలు తాము సంపాదిస్తున్న సంపాదనలో సింహా భాగం విద్య,వైద్యం, పిల్లల ఉద్యోగాల కోచింగ్ ల కోసం ఖర్చు చేస్తున్నారు. పారిశ్రామిక విప్లవ ప్రారంభం లో పెట్టుబడి ఉద్యోగాలను సృస్టి కి దోహద పడి, పెట్టిన పెట్టుబడి పైన వచ్చే లాభాలతో ఉద్యోగులకు బోనస్, ప్రభుత్వాలకు పన్నులు కట్టేవి. కానీ ఇప్పుడు పెట్టుబడి అలా చేయకుండా తమ సంపద పెంచుకోవడానికి పోటీ పడి క్రోనీ కాపిటల్ ను తయారు చేసుకుంటున్నది. ఒక కంపెనీ పెట్టి దానిపైన బ్యాంకు నుండి అప్పు తీసుకుంటుంది. ఆ కంపెనీకి మార్కెటింగ్ కోసం మరో సంస్త ను తెరుస్తుంది. మొదటి కంపెనీకి నష్టాలు చూపి బ్యాంకు అప్పు ఎగగొడుతుంది. ఇలాంటి జిమ్మిక్కులు ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం పైన పెట్టుబడి దారుల సంపద దినదినం కోట్లల్లో పెరుగుతుంటే ప్రజల పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, అను త్పా దక సైన్యం ( Useless Force), అంతకంతకూ పెరిగి పోతున్నది.కారణం ఏమిటి? ఎవ్వరు అనేది ప్రజలకు అర్థం కావాల్సి ఉంది.

ఒక నాడు ప్రజలకు తెలియని సంస్కృతం ప్రజలను ఏలింది, ఇంగ్లీష్ కొన్నాళ్ళు, ఇప్పుడు భాషలు పోయి టెక్నాలజీ, ఆర్థిక శాస్త్రం కలగల్సి ప్రజలను అవిద్యావంతులను చేస్తున్నది. చదువులు వస్తే ఏలికలను ప్రశ్నిస్తారని, చదవునుండి దూరం చేశారు. ఆ తర్వాత ఆధునిక టెక్నాలజీ అందరికీ అందని ద్రాక్షను చేశారు. ఆర్థిక శాస్త్రం అయితే అర్థం కానీ బ్రహ్మ పదార్థాన్ని చేశారు. కనుక ఇప్పుడు ఆర్థక శాస్త్రం మూలాలను అందరికీ అర్థం అయ్యే విధంగా సులభ గ్రాహ్యం చేసి , ఏలికలు , పెట్టుబడి కలగలిసి ప్రజలను ఎలా గొర్రెలుగా చేసి వేటాడి తింటున్నాయో ప్రజలకు తెలియ జెప్పి , తమ అవిద్యకు , అనారోగ్యానికి, ఆకలి చావులకు , నిరుద్యోగానికి , పేదరికానికి , కారణం అయిన ఆ ప్రజల శత్రువును ప్రజల ముందు నిలుపాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరు వహిస్తారో ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

-వీరగోని పెంటయ్య,
విద్యావేత్త

Also Read: Indian Currency: మన రూపాయి మారకం.. చాలా దేశాల్లో అధికం

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular